Allu Aravind: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. RRR, బాహుబలి, పుష్ప సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాలు రికార్డు స్థాయి వసూలు రాబట్టాయి. దీంతో తెలుగులో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలలో సగానికి పైగా పాన్ ఇండియా సినిమాలు నిర్మితమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలు ఈ దిశగానే సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు విజయ్ తో “వారసుడు” అనే సినిమా ఆ రకంగానే తీసి నిర్మించారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
రామ్ చరణ్ తో కూడా చేయబోయే “గేమ్ చేంజర్” పాన్ ఇండియా నేపథ్యంలో నిర్మిస్తున్న సినిమాయే. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ బిగ్ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందని… ఇండస్ట్రీలో కొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించబోతున్నట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. “పుష్ప 2” సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
కానీ “గుంటూరు కారం” తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఇదే సమయంలో రామ్ పోతినేనితో సినిమా చేయాలని త్రివిక్రమ్ లేటెస్ట్ గా నిర్ణయం తీసుకోవడం జరిగిందట. దీంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి టైం పట్టే అవకాశం ఉండటంతో బోయపాటి ప్రాజెక్టు తెర పైకి బన్నీ తీసుకొచ్చినట్లు టాక్. ఆల్రెడీ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “సరైనోడు” అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈసారి పాన్ ఇండియా నేపథ్యంలో అల్లు అర్జున్ తో భారీ ప్రాజెక్ట్ సినిమా బోయపాటి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని అల్లు అరవింద్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!