Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరైన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. `పటాస్` మూవీతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి.
దీంతో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరిగా ముద్ర వేయించుకున్న అనిల్ రావిపూడి.. తాజాగా `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించాడు. `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులో హీరోలుగా నటించారు. వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. భారీ అంచనాల నడుమ మే 27న రిలీజ్ అయిన ఈ మూవీ.. సూపర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద నయా కలెక్షన్స్ రాబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా.. ఆ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. `థంబ్ నేల్స్ పెట్టుకోండి, నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంది .. మరో ఫ్యామిలీ ఇక్కడున్న ఈ టీమ్. మూడో ఫ్యామిలీ ఆడియెన్స్.` అని అనిల్ తన మనసులో మాటను ఓపెన్గా చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ.. `ఎఫ్ 3 రిలీజ్ అయిన దగ్గర నుంచి వసూళ్లతో పాటు ప్రశంసలు పెరుగుతున్నాయి. ఈ వారమంతా కూడా ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కరోనా తరువాత వచ్చిన అఖండ, పుష్ప, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ఆ సినిమాల సరసన ఎఫ్ 3 నిలవడం సంతోషంగా ఉంది` అంటూ ఆయన పేర్కొన్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!