NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ మల్టీస్టార్ చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఉన్న ఈ సినిమా.. కరోనా కారణంగా మార్చి 25కు షిప్ట్ అయింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ను కొరటాల శివతో ప్రకటించాడు.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు తమ హీరో మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంభరపడిపోయారు. కానీ, జాన్వీ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా చేదు వార్త చెప్పారు.
హైదరాబాద్ లో జరిగిన `వలీమై` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటించడమనేది పుకారే అని, సోషల్ మీడియాను నమ్మితే పాగల్ అవ్వడం ఖాయమని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. అయితే మంచి స్క్రిప్ట్ వస్తే మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నిటిలోను చేయడానికి జాన్వీ సిద్ధంగా ఉందని బోనీ కపూర్ తెలిపారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!