Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో `సిద్ధ` అనే ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్డేలను తీసుకున్నారు.
కానీ పలు కారణాల వల్ల కాజల్ను సినిమా నుంచి తప్పించారు. ఇక గత ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం చిత్ర యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా ఆచార్య గురించి ఎన్నో విశేషాలను వారు పంచుకున్నారు. అలాగే చిరంజీవి `సిద్ధ` పాత్ర గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ చేసి సిద్ధ పాత్రకు నేను ఎంతగానో కనెక్ట్ అయిపోయా. ఒకవేళ ఈ సినిమాకు చరణ్ నో చెప్పుంటే, అతడి డేట్స్ దొరక్కపోయుంటే ఖచ్చితంగా ఆ పాత్రకు పవన్ కళ్యాణ్నే ఎంపిక చేసేవాళ్లం.
చరణ్ ఇచ్చే ఫీల్ ను, పవన్ మినహా ఇతర యాక్టర్స్ నుంచి రావడం కష్టం. అందుకనే పవన్తోనే సినిమా చేసేవాళ్లం` అంటూ చిరు చెప్పుకొచ్చారు. ఏదేమైనా చిరు, చరణ్ కలిసి నటిస్తేనే మెగా ఫ్యాన్స్లో ఉత్సాహం ఓ రేంజ్లో ఉంది. అదే చరణ్ ప్లేస్లో పవన్ నటించుంటే బాక్సాఫీస్ వద్ద రచ్చ మరోలా ఉండేదని అంటున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!