Tollywood: టాలీవుడ్ Tollywood లో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తోందనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో ధియేటర్లు మూసేశారు. వకీల్ సాబ్ రన్ అవుతున్న ధియేటర్లు మినహా అన్నీ కరోనా ఎఫెక్ట్ తో మే 1 వరకూ అన్ని ధియేటర్లు మూసేసారు. ఏపీలో ఇంకా ధియేటర్లు మూసివేతపై ఇంకా నిర్ణయం ఏదీ తీసుకోలేదు. కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్లు రన్ అవుతున్నాయి. ఇక్కడా వకీల్ సాబ్ మినహా దాదాపు మరే సినిమా లేదు. ఈనేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాలపై కరోనా ఎఫెక్ట్ పడుతోందనే చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా మే నెలలలో విడుదలకు సిద్ధమవుతున్న పెద్ద సినిమాల నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాకపోవడమే.
మే నెలలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ అఖండ, వెంకటేశ్ నారప్ప, రవితేజ ఖిలాడీ.. ఇలా భారీ సినిమాల రిలీజ్ లే ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ప్రస్తుత కోవిడ్ తీవ్రతకు బ్యాలెన్స్ షూటింగే జరగని పరిస్థితి నెలకొంది. ఏమాత్రం అజాగ్రత్తగా విరుచుకుపడిపోతున్న కరోనా మహమ్మారితో జాగ్రత్త అవసరమనే షూటింగ్స్ నిలిపేస్తున్నారు. ఆచార్య షూటింగ్ కు సైకిల్ మీద సోనూసూద్ వచ్చాడు. మరునాడే కరోనా వైరస్ అనే వార్తలు వచ్చాయి. ఖిలాడీ దర్శకుడు రమేశ్ వర్మ కోవిడ్ ఎఫెక్ట్ కు గురయ్యాడు. వైరస్ తీవ్రతకు జగపతిబాబు, పూజాహగ్డే షూటింగ్ కే రానని చెప్పడం, ప్రభాస్, మహేశ్, వంటి హీరోలు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారనే వార్తలు కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. ఈనేపథ్యంలో సినిమాల విడుదలపై ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయి.
మరోవైపు రాబోయే మూడు వారాలు మరింత కీలకమని నిపుణులు, ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. దీంతో వ్యవస్థలు నిలిచిపోతున్నాయి. దీంతో ఇప్పటివరకూ మే నెల సినిమాల విడుదలపై ఎటువంటి ప్రకటనా చేయని సినిమాలు పరిస్థితులను అంచనా వేసాకే ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఇష్క్, విరాటపర్వం, టక్ జగదీశ్, లవ్ స్టోరీ వంటి సినిమాలు వాయిదా పడ్డాయి. వీటికి కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ సినిమాల విడుదల పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!