Dil Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ పెద్దఎత్తున ఎగబకుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం ఇంకా పూర్తికాకనే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగా స్టార్ మాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో కనిపిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయడంతో, అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల నుంచి ఈ సినిమా పై గట్టి నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా ఆచార్య సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసుకుంటుందని చెప్పవచ్చు.
ఆచార్య సినిమాను మొదటగా 35 కోట్ల రూపాయలతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకోవాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో, వరంగల్ శీను దిల్ రాజుకు పోటీగా నైజాం హక్కులను ఏకంగా 42 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నాడు.ఈ మధ్యనే వరంగల్ శీను దిల్ రాజు పై పలు విమర్శలు చేయడంతో వీరి ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. మామూలుగా అయితే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అని వచ్చినప్పుడు తప్ప 42 కోట్లతో కొన్న సినిమా వర్కవుట్ కాదు.చిరంజీవి నటించిన గత సినిమా సైరా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
కానీ ఆచార్య సినిమా విషయంలో నైజాం హక్కులను 42 కోట్లకు కొనడానికి గల కారణం కేవలం వరంగల్ శీను దిల్ రాజ్ కుమార్ గా ఉన్న విభేదాలే కారణమని చెప్పవచ్చు.
ఎలాగైనా ఈ సినిమా దిల్ రాజు కొనకుండా చేయాలన్న ఉద్దేశంతోనే 42 కోట్లకు సొంతం చేసుకున్నాడు అని సినీ వర్గాల సమాచారం. ఇక నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్న దిల్ రాజు తన చేతిలో ఎన్నో థియేటర్లు ఉన్నాయి. సినిమా ఎక్కువ బడ్జెట్ పెట్టి కొన్న వాటిని ఎలాగైనా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వరంగల్ శీను పరిస్థితి అయోమయ స్థితిలో ఉంది. కేవలం దిల్ రాజు థియేటర్లన్నీ తన చేతిలో పెట్టుకొని వరంగల్ శీనుకి భారీ షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోందని చెప్పవచ్చు.