Puri Jagannadh: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టే దర్శకులు సంవత్సరాలు తరబడి సినిమాలు చేస్తారు. కానీ ఇండియాలో కొన్ని నెలలలోనే సినిమాలు పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి వారికి స్టార్ డమ్ రావడంలో.. పూరి జగన్నాథ్ సినిమాలు కీలక పాత్రలు పోషించాయి. ముఖ్యంగా మహేష్ బాబుకి “పోకిరి” సినిమాతో ఊహించని ఇమేజ్ రావటం జరిగింది. 2006లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూడటం జరిగింది.
ఒకానొక సమయంలో ఉన్నా బిల్డింగులు ఆఫీసు కూడా అమ్మేసుకోవడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం వరుస పరాజయాలతో ఉన్న పూరి “ఇస్మార్ట్ శంకర్”తో మంచి హిట్ అందుకున్నారు. కానీ తర్వాత పాన్ ఇండియా నేపథ్యంలో తీసిన “లైగార్” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం “ఇస్మార్ట్ శంకర్” సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తన కొడుకు ఎంతగానో నమ్మిన వ్యక్తే మోసం చేశాడని అన్నారు. మా అబ్బాయి పేరు చెప్పి బయట కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. మా అబ్బాయికి తెలియకుండా సంతకాలు పెట్టించి మోసం చేశాడు. మా అబ్బాయికి తెలియకుండా 80 కోట్ల రూపాయలు దోచేయడం జరిగింది. ఆ సమయంలో ఆ వ్యక్తి కాళ్లు చేతులు విరగకోడదమని చాలామంది సలహా ఇచ్చారు. మా అబ్బాయికి జాలీ ఎక్కువ…మానవత్వంతో ఆ వ్యక్తిని వదిలేశాడు. కానీ ఆ అప్పులను తీర్చేందుకు ఐదు ఆరు బిల్డింగులను అమ్మాల్సి వచ్చింది. తనను మోసం చేసిన వ్యక్తి బాగుపడలేదు. నా కొడుకు అంత పోగొట్టుకున్నాడు అంటూ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ కీలక ఎమోషనల్ కామెంట్స్ చేయడం జరిగింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!