Madhuranagarilo January 31 2024 Episode 275: కృష్ణ బయటికి వెళుతూ ఉండగా శ్యామ్ వాళ్ళు లోపలికి వస్తారు. వాళ్లను చూసి షాక్ అయిన కృష్ణ లోపలికి వచ్చి రాదని పడుకోమని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్లి తీసుకువస్తుంది. పండు లోపలికి వచ్చి రాదని చూసి మమ్మీ నీకేమైంది ఎందుకలా పడుకున్నావ్ లే అని లేపుతాడు. అమ్మకి చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న నువ్వు అలా పిలువకు అని కృష్ణ చెబుతుంది. చిన్న యాక్సిడెంట్ అయితే నేను పిలిచిన మమ్మీ ఎందుకు లేవదు అని పండు అంటాడు. పండు మమ్మీకి యాక్సిడెంట్ కావడంతో బాధ తెలియకూడదు అని డాక్టర్ గారు ఇండీషన్ వేశారు అలా నిద్రపోతుందంతే అని శామ్ చెప్తాడు. అయితే అమ్మ లేచే దాకా ఇక్కడే ఉంటాను అని పండు అంటాడు. అమ్మ ఎప్పటికీ లేస్తుందో తెలియదు నాన్న నువ్వు అలా అనకూడదు ఇంటికి వెళ్ళిపో అన్నం తినలేదు కదా అని కృష్ణ అంటుంది. నాకు అన్నం వద్దు అమ్మే కావాలి అని పండు అంటాడు.
మమ్మీ లే మమ్మీ లే మన ఇంటికి వెళ్ళిపోదాం అని పండు అంటాడు. నేను అనుకున్నట్టు కొన్ని రోజులు ఇదే హాస్పిటల్ లో ఉంటే పండు అని రోజులు అన్నం తినడు అని రాధా ఆలోచిస్తుంది. పండు బాధని చూడలేక రాదా కళ్ళు తెరుస్తుంది. రాధా పండు నీ దగ్గరికి తీసుకొని నువ్వు ఏడవకు నాన్న నాకేం కాలేదు చిన్న యాక్సిడెంట్ అంతే అని అంటుంది. 48 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేనన్నారు రాధ స్పృహలోకి ఎలా వచ్చింది అని రుక్మిణి అడుగుతుంది. తల్లికి కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల రాధకి స్పృహ వచ్చింది అని కృష్ణ అంటుంది. పోనీలే అమ్మ మా కోడలికి స్పృహ వచ్చింది అదే చాలు అని మధుర అంటుంది. అమ్మ నాకు ఆకలి వేస్తుంది మన ఇంటికి వెళ్దాం పద అని పండు అంటాడు. నువ్వు వెళ్లాలనుకుంటే ఇంటికి వెళ్లొచ్చు రాదా అని కృష్ణ అంటుంది. రెండు రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది రాదా నీ పుట్టినరోజు మన ఇంటిలో జరుపుకోవాలని ఇంకేం ఆలోచించకు ఇంటికి వెళ్దాం పద అని శ్యామ్ అంటాడు.
పండు కోసమైనా నేను ఇంటికి వెళ్ళాలి పుట్టినరోజు అయిపోగానే అక్కడ నుంచి వెళ్లిపోవాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే,ఏంటి హాస్పిటల్ కి వెళ్ళిన ఫ్యామిలీ ఇంకా రాలేదు అని దాక్షాయిని అంటుంది. వినకూడని వార్త ఏమన్నా వింటామేమో డాక్టర్ ఇక బతకదని చెప్పేసారేమో అని చలపతి అంటాడు. ఇంతలో రాధాని తీసుకొని ఇంటికి వస్తారు. ఆ సంఘటన చూసి చలపతి దాక్షాయని షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నారు మా చెల్లెలు ఎలా బ్రతికి వచ్చిందని షాక్ అవుతున్నారా పండు ప్రేమ వల్ల మా చెల్లెలు బ్రతికి ఇంటికి వచ్చింది అని రుక్మిణి అంటుంది. ఇప్పుడు పండు కోసం రావాల్సి వచ్చింది నీకు శ్యామ్ సార్ కి మధ్య ఇంకెప్పుడు అడ్డం రాను అని రాధా మనసులో అనుకుంటుంది. నీకు యాక్సిడెంట్ అయింది నీ అడ్డు తొలగిపోయింది అనుకుంటే మళ్ళీ బ్రతికి ఇంటికి వచ్చావా రాదా ఏదో ఒక రకంగా నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని ఇరుక్కుని అనుకుంటుంది.
రుక్మిణి లోపలికి వెళ్లి హారతి తీసుకువచ్చి రాధకి దిష్టి తీసి తీసుకెళ్లి బయట పడేస్తుంది. రాదని మధుర లోపలికి తీసుకువెళుతుంది.హారతి బయటపడేసినా రుక్మిణి రాధా నీ బ్రతుకు కూడా ఈ కర్పూరం లాంటిది ఆ కర్పూరంల వెలిగి వెలిగి ఆరిపోక తప్పదు అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, చలపతి ఏడుస్తూ ఉంటాడు ఇంతలో దాక్షాయిని వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది.రుక్మిణి ఈ ఇంటికి కోడలు అయిపోతే మనం ఈ ఇంట్లో సెటిలైపోవచ్చు అనుకున్నాం కదా కానీ ఇప్పుడు అనుకోకుండా రాదని కూడా తీసుకొచ్చారు కదా రాధకి మన విషయాలు తెలుసు కదా తను మన బుట్టలో పడదు కదా అని చలపతి అంటాడు.
రాధ మన బుట్టలో పడకపోయినా రుక్మిణి మన బుట్టలో వేసుకొని రాదని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టొచ్చు అని దాక్షాయిని అంటుంది. ఏదో రకంగా రాదని ఇంట్లో నుంచి పంపించేయాలి అని రుక్మిణి అనుకుంటుంది.ఇంతలో దాక్షాయిని వచ్చి ఏం చేస్తున్నావ్ రుక్మిణి అని అంటుంది. మీరేం చెప్పాలనుకున్నారు పిన్ని అని రుక్మిణి అంటుంది. శ్యామ్ మొదటి భార్య నువ్వు అని తెలవగానే రాధా శ్యామ్ ని నీకు వదిలేసి వెళ్లిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు ఎందుకు ఆలోచించు అని దాక్షాయిని అంటుంది. రాధా ఇక్కడ ఉన్నంతకాలం నీ బిడ్డ నీ దగ్గరికి రాలేడు కదా అని చలపతి అంటాడు.
రాధా ఇక్కడ ఉన్నంతకాలం మీ అత్తయ్య మామయ్య గారు కూడా రాదని చూసినట్టు చూడలేరు కదమ్మా అని రుక్మిణి మనసులో విషాన్ని నింపుతూ ఉంటారు చలపతి దాక్షాయిని. అన్ని మాటలు చెప్పి దాక్షాయని చలపతి వెళ్ళిపోతారు. రాదని ఇకనుంచి పంపించాలంటే అదే కరెక్ట్ అత్తయ్యని మామని నా బుట్టలో వేసుకోవాలి అని రుక్మిణి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!