Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఇందులో కీర్తి సురేశ్ మహేశ్ సరసన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే చివరి షెడ్యూల్ జరుగుతున్న సమయంలో సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అందుకు కారణం ఇటీవలే స్పెయిన్లో మహేష్ మోకాలికి సర్జరీ జరగడంతో డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులపాటు చిత్రీకరణ వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో మహేష్ ఆపరేషన్ తర్వాత దుబాయ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో గడిపిన ఆయన.. అలాగే నెక్స్ట్ సినిమా చర్చల కోసం కేటాయించారు. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి హారిక అండ్ హాసిని సంస్థ పై రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్గా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
Mahesh: జనవరి నుంచే ఫైనల్ షెడ్యూల్ షూటింగ్
అయితే సర్కారు వారి పాట షూటింగ్ మళ్ళీ ఫిబ్రవరిలో ఉంటుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మహేశ్ త్వరగానే రికవర్ అయిన నేపథ్యంలో జనవరి నుంచే ఫైనల్ షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఇది మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మహేశ్ కాలికి ఆపరేషన్ జరగడంతో బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో..అసలు ఏప్రిల్ 1న రిలీజ్ అవుతుందా లేదా అని సందేహాలను వ్యక్తం చేశారు. కానీ, అవన్నీ ఇప్పుడు పటాపంచలు కాబోతున్నట్టు తెలుస్తోంది.