మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 40 శాతం షూటింగ్ పూర్తయ్యాక కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో రీసెంట్ గా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ హిట్ సినిమా ‘వేదాళం’ రీమేక్ చేస్తారని అంటున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో రౌండ్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇప్పటికే ప్రారంభించారని అంటున్నారు. సినిమాలో దసరాకు సంబంధించి ఎపిసోడ్ ఉందని.. ఈ దృశ్యాలను చిత్రీకరించడానికి ఇప్పటికే బెంగాల్ వెళ్లి అక్కడ కొన్ని దృశ్యాలు చిత్రీకరించారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దసరా సమయంలోనే ఇందుకు సంబంధించిన విజువల్స్ మాత్రం చిత్రీకరించినట్టు చెప్తున్నారు. అయితే.. ఇందులో చిరంజీవి పాల్గొనలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా రౌండ్ అవుతోంది. దీంతో ఆచార్య తరువాత చిరంజీవి చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. ఇందుకు చిరంజీవి ఆమధ్య గుండు టెస్ట్ చేయించుకున్న లుక్ ను ఉదహరిస్తున్నారు. దీంతో బెంగాల్లో సన్నివేశాలు చిత్రీకరించారని అంటున్న వార్తలకు బలం చేకూరుతోంది.
అయితే.. ఈ విషయంపై ఇప్పటికవరకూ మెగా కాంపౌండ్ నుంచి గానీ, మెహర్ రమేశ్ నుంచి గానీ ఎటువంటి న్యూస్ రివీల్ కాలేదు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను అతి త్వరలోనే పూర్తి చేసి మెహర్ రమేశ్ తో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయించే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్టు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి క్యాస్ట్ ఎవరనే విషయం కూడా వెల్లడికాలేదు. సినిమాకు సంగీతం మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందిస్తారని మాత్రం అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలన్నింటిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!