Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు…శ్రీలీల జంటగా నటించిన సినిమా “గుంటూరు కారం”. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయినా గని మహేష్ క్రేజ్ కి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా కంటే ఈ సినిమాలో “కుర్చీ మడతపెట్టి” సాంగ్ బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. “గుంటూరు కారం”లో ఈ పాట ఒక్కటే పెద్ద హిట్గా నిలిచిందని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. మంచి మాస్ బిట్ పడిన ఈ సాంగ్ కి ధియేటర్ లు దద్దరిల్లింది అని చెప్పవచ్చు.
ఈ సాంగ్ కి హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్తో పాటు మహేష్ బాబు ఎనర్జీ కూడా పాటను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాస్ పాటకు తగ్గ డ్యాన్స్ కంపోజ్ చాలామందిని ఆకట్టుకొంది. “గుంటూరు కారం” విడుదల కాకముందు “కుర్చీ మడతపెట్టి” సాంగ్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ పరంగా ఈ సాంగ్ కి… వన్ మిలియన్లకు పైగా వ్యూస్ రావడం జరిగిందట. మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత ఆదరణ పొందిన సాంగ్ గా “కుర్చీ మడత పెట్టి” సాంగ్ చరిత్ర సృష్టించింది. ఈ సాంగ్ లో మహేష్ వేసిన స్టెప్పులు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. సినిమా పోయినా గాని మహేష్ డాన్స్ చూసి ఫాన్స్ సంతృప్తి చెందారు.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు త్రివిక్రమ్ సరిగ్గా సినిమా చేయలేదని చాలామంది నెగటివ్ కామెంట్లు చేయడం జరిగింది. గతంలో మహేష్ బాబుని అతడు, ఖలేజాలో అద్భుతంగా చూపించారు. కానీ “గుంటూరు కారం” సినిమాలో కొత్తదనం ఏమీ కనబడలేదు. ఎక్కడ త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు కూడా సినిమాలో లేవు. అందువల్లే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు పూర్తిగా రాజమౌళి సినిమా పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.