మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం అక్టోబర్ 3న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హై బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ముహూర్తపు షాట్కి సూపర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్రామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలోభారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, అగ్ర నిర్మాత అనీల్ సుంకర, ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!