Pawan Kalyan : దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ రావడంతో వరుసపెట్టి సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోలకు చేతిలో లేని సినిమాలు పవన్ కళ్యాణ్ ఖాతాలో ఉన్నాయి. దాదాపు ఐదు కు పైగా సినిమాలు పవన్ రానున్న రెండు సంవత్సరాలలో విడుదల చేయనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకపక్క దగ్గుబాటి రానా తో చేస్తున్న మల్టీ స్టారర్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రాణా సినిమా కంటే ముందే క్రిష్ సినిమా మొదలవడం జరిగింది. మొగలుల సామ్రాజ్యం కాలంనాటి ..స్టొరీ తో పౌరాణిక నేపథ్యం లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్ర లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్రపుస్వారీ తరహాలో పోరాట సన్నివేశాలు ఉండటం తో తాజాగా ..సినిమా సెట్ లో అపశృతి చోటు చేసుకున్నట్లు సమాచారం.
మేటర్ లోకి వెళ్తే సినిమాలో కీలక సన్నివేశం చిత్రీకరిస్తున్న తరుణంలో నటుడు ఆదిత్య మీనన్ గుర్రం మీద నుంచి పడిపోయినట్లు దాదాపు 15 కుట్లు అతనికి పడినట్లు, చెన్నై లో పెద్ద ఆసుపత్రి లో సినిమా యూనిట్ జాయిన్ చేసినట్లు సమాచారం. కీలక పోరాట సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో..ఒక్కసారిగా బాంబు పేలడంతో గుర్రం అదుపు చేయలేని తరుణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన.. సినిమా యూనిట్ స్పందించి నటుడు ఆదిత్య ని చెన్నై ఆస్పత్రికి తరలించినట్లు ఫిలిం నగర్ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!