15 ఏళ్ళ సినీ కెరీర్ లో అనుష్క ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. కమర్షియల్ సినిమాలతో సాగిన సక్సస్ ఫుల్ జర్నీలో అరుంధతి వంటి మైల్ స్టోన్ లాంటి సినిమా అనుష్క కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ సినిమా నుంచి ఇండస్ట్రీలోనే కాదు సౌత్ మొత్తం లో అనుష్క ని చాలా ప్రత్యేకంగా చూశారు. సినిమా కోసం ఎంతైనా రిస్క్ చేస్తుందనడానికి సైజ్ జీరో ఒక పెద్ద ఉదాహరణ. ఇక బాహుబలి సినిమా లాంటి పాన్ ఇండియా సినిమాతో మరో స్థాయికి చేరుకుంది అనుష్క.
ఆ తర్వాత చేసిన సినిమా ‘భాగమతి’. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు రెండేళ్లు ఏ సినిమాని ఒప్పుకోలేదు. దాంతో అనుష్క ఇక సినిమాలు చేయాదా ..అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే ‘నిశ్శబ్దం’ చేస్తున్నానంటూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ అనుష్క జంటగా నటించారు. అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే, అంజలి, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ నటుడు మైఖెల్ మ్యాడ్సన్ కీలక పాత్రను పోషించారు. కోనా వెంకట్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్న అనుష్క మోసపోయిందట. చాలా కాలంగా సరైన సక్సస్ లేని అనుష్క ఈ పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ ఫాం లోకి రావాలనుకుంటే అది సాధ్యపడటం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తై రిలీజ్ సిద్దంగా ఉన్నా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!