Sarkaaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’.. సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు పరుశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమా. ఇటీవలే మేకర్స్ ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ బ్యాలన్స్ సాంగ్ ను కూడా కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలై శరవేగంగా జరుగు తోంది. ఈ ‘సర్కారు వారి పాట’ సినిమాను పలు వాయిదాల తర్వాత ఫైనల్గా 2022 మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ మళ్ళీ డైలమాలో చిత్రబృందం ఉన్నట్టు టాక్ మొదలైంది. తాజాగా..బీస్ట్, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ మాత్రం భారీ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. గత నెల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా సత్తా చాటుతూ ఉంది. అక్టోబర్ నుంచి మరో 30 దేశాలలో కూడా రిలీజ్ కానుంది. ఇక ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ వసూళ్ళ సునామీ ఇప్పుడే మొదలైంది. ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకూ దీని సందడి కొనసాగుతుంది.
Sarkaaru Vaari Paata: అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మెగా మల్టీస్టారర్ సినిమా కోసం ఎక్కువ సంఖ్యలో మెయిన్ థియేటర్లను బ్లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 12న ‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజైతే కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు న్నాయి. ఎక్కువ సంఖ్యలో బాబుకు థియేటర్లు దొరకడం కష్టమే అంటున్నారు. ఇవన్నీ దృష్ఠిలో పెట్టుకొని ఇప్పుడు సర్కారు వారి పాటను వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!