దివంగత తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. `దఢక్` సినిమాలో మాత్రమే మాత్రమే నటించినప్పటికీ ఈమెకు కావాల్సినంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు కార్గిల్ గర్ల్, తక్త్ చిత్రాల్లో నటిస్తుంది. మరికొన్ని సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి. హీరోయిన్గా బిజీగా ఉన్న జాన్వీ బాలీవుడ్కి చెందిన ఓ మేగజైన్కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ “తనకు ప్రేమపై అవగాహన ఉండదంటూ అమ్మ అభిప్రాయం. అందుకు కారణం నేను ప్రేమలో ఈజీగా పడిపోతాననని ఆమె అనుకునేది. కాబట్టి ఆమె నాకొక మంచి అబ్బాయిని చూస్తాననేది. నేను గ్రాండ్నెస్కు చాలా దూరంగా ఉంటాను. నాలాగా నేను ఉండాలనుకుంటాను. అందుకే నా పెళ్లిని సింపుల్గా తిరుపతిలో చేసుకుంటాను. దక్షిణాది వంటకాలైన ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, ఖీర్ వంటి వాటినే పెళ్లికి వచ్చిన వారికి విందుగా పెడతాను“ అన్నారు. కాబోయే వ్యక్తి గురించి చెబుతూ “నాకు కాబోయే వ్యక్తి చేస్తున్న వృతిపట్ల అంకిత భావం ఉన్నవాడై ఉండాలి. నైపుణ్యం ఉన్నవాడిగా ఉండాలి. అతని నుండి నేను కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునేలా తను ఉండాలి. సెన్సాఫ్ హ్యుమర్ ఉండాలి“ అన్నారు జాన్వీ కపూర్.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!