బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు బాలీవుడ్ మీడియా షాకిచ్చింది. ఇటీవల `జడ్జిమెంటల్ హై క్యా` సినిమా ప్రమోషన్స్ విషయంలో జర్నలిస్ట్తో గొడవకు దిగింది. తన `మణికర్ణిక` సినిమా గురించి సదరు జర్నలిస్ట్ను ప్రశ్నించింది. తాను రాయలేదని జర్నలిస్ట్ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. దాంతో గొడవ పెద్దదైంది. కంగనా రనౌత్ క్షమాపణ చెప్పకుంటే ఆమెను బ్యాన్ చేస్తామని బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ మీడియా వార్నింగ్ ఇచ్చింది. అప్పటికీ `జడ్జ్మెంటల్` నిర్మాత ఏక్తాకపూర్ కంగనా క్షమాపణలు చెప్పిందే కానీ.. కంగనా సారీ చెప్పలేదు. సరికదా! నన్ను బ్యాన్ చేసుకోండంటూ వీడియో విడుదల చేసింది. దీంతో జర్నలిస్టుల కోపం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కంగనాకు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన విధించింది. ఇప్పుడు కంగనా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!