Director Krish: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు క్రిష్ అందరికి సుపరిచితుడే. ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు మనోడు చేయడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో అనుష్కతో సినిమా ప్లాన్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే గచ్చిబౌలి డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ సేవిస్తున్న పలువురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడి కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త కుమారులు పెద్ద పార్టీలో ఉన్నట్లు ప్రకటించారు. కానీ, పక్కా సమాచారం మేరకు పోలీసులు రాడిసన్ హోటల్లో సోదాలు చేసి అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్న వారందరినీ పట్టుకున్నారు. ముగ్గురు డ్రగ్స్ వాడే యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ కేసులో ఇద్దరు బాలికలు, తొమ్మిది మందిపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే మోడల్ లిపి గణేష్, టాలీవుడ్ నిర్మాత సహా పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా, ముగ్గురు డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారని పోలీసులు. అంతేకాదు పోలీసులు ఎఫ్ఐఆర్లో క్రిష్ పేరు ఎనిమిదో నిందితుడిగా చేర్చారు.. పార్టీ జరుగుతున్న సమయంలో హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ హోటల్ అధినేతతో అరగంట పాటు కూడా కూర్చున్నారని రాడిసన్ యజమాని వివేకానందుతో ఆయన మాట్లాడినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేస్ పై క్రిష్ స్పందిస్తూ.. తాను హోటల్ కి వెళ్లడం నిజమేనని సాయంత్రం ఒక అరగంట మాత్రమే అక్కడ ఉన్నానని ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు వెల్లడించారు. మళ్లీ తిరిగి ఆరు గంటల 45 నిమిషాలకు తాను ఆ హోటల్ నుంచి కూడా బయటికి వచ్చేసానని అప్పుడే ఆ హోటల్ వివేకానంద తో పరిచయం ఏర్పడింది అంటూ వెల్లడించారు.
డ్రైవర్ రాలేకపోవడంతో కొద్దిసేపు మాట్లాడామంతే అని తెలిపారు.. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తాను చెప్పానంటే క్రిష్ పేర్కొన్నారు. దీనిపైన ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్నారని వెల్లడించారు.. డ్రగ్స్ కేసుతో తనకి ఏమి సంబంధం లేదని స్పష్టం కూడా చేశారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా.. రాడిసన్ డ్రగ్ రాకెట్లో దర్శకుడు క్రిష్ ప్రమేయం ఉన్నట్లు పూర్తిగా నిర్థారణ కానప్పటికీ.. ‘ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం’ అని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు.‘. హోటల్లో వారు వరుస పార్టీలు నిర్వహించగా, నిర్భయ్ కొకైన్ తాగినట్లు పరీక్షల్లో తేలిందని డీసీపీ వినీత్ వెల్లడించారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!