సాధారణంగా సినిమాలకు, రాజకీయాలకు దగ్గరి సంబంధాలే ఉంటాయి. అయితే కొందరు సినీ హీరోలు మాత్రం.. రాజకీయాలకు తమకు సంబంధం లేదంటూ తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. అలాంటి వారిలో హీరో మాధవన్ ఒకరు. ఈయన ప్రస్తుతం తను టైటిల్ పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న `ద రాకెట్రీ` సినిమాతో బిజీగా ఉన్నారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నట్లుండి కోపం వచ్చింది. ఇంతకు మాధవన్కు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎందుకు కోపం వచ్చిందంటే.. కాంగ్రెస్ ఐటీ విభాగం ప్రధాని మోదిపై విడుదల చేసిన వీడియో కారణం. ఎందుకంటే ఈ వీడియోలో చైనా ప్రధాని జిన్పింగ్కు మోది భయపడుతున్నట్లు ఉంది. దీన్ని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మాధవన్ కూడా కోపాన్ని వ్యక్తం చేశాడు. `మన దేశ ప్రధానిని ఇలా కించపరచటం చాలా బాధాకరం. ఇది మన దేశానికి అవమానకరం. ఇవన్నీ స్కూల్ రాజకీయాలను తలపిస్తున్నాయి. ఇలాంటివి మీ నుండి కోరుకోవడం లేదు. ఇలాంటివి మానుకుంటే మీకు, దేశానికి మంచింది“ అంటూ మెసేజ్ను పోస్ట్ చేశారు.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!