Madhuranagarilo February 26 2024 Episode 297:ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది అని కృష్ణ అంటుంది. పద రాధా అని రుక్మిణి కృష్ణ తనని తీసుకువెళ్తారు. సిగ్గు పడిన కాడికి చాల్లే పెళ్లికూతురా నీ భర్త కోసం కాస్త దాచుకో అంటూ శ్యామ్ గదిలోకి నెట్టేస్తారు. రాధా సిగ్గుపడుతూ లోపలికి వెళుతుంది. తెల్ల చీర కట్టుకొని పాల గ్లాసు పట్టుకుని వచ్చిన రాదను చూసి శ్యామ్ ఆశ్చర్యపోతాడు. తన దగ్గరికి వెళ్లి ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదా ఏంటివి అని శ్యామ్ అడుగుతాడు. పాలు అని రాదా అంటుంది.ఈ పాలు తాగి మురిపాలు పంచుకుందామా అని శ్యామ్ అంటాడు. రాధా సిగ్గుపడుతూ తలవంచుకుంటుంది.
ఈరోజు శుక్రవారమ మౌనవ్రతం చేస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. రాధా శ్యామ్ కి పాల గ్లాసు ఇస్తుంది. శ్యామ్ పాలు తాగి రాధకి కొన్ని తాగిపిస్తాడు. పాలు తాగేసాం మురిపాలు పంచుకుందామా ఇక యాగం మొదలు పెడదామా అదే పుత్రకామేష్టి యాగం అని శ్యామ్ అంటాడు. రాధా సిగ్గుపడుతూ శ్యామ్ గుండెల మీద వాలిపోతుంది. కట్ చేస్తే, మత్తు మందు కలిపిన పాలు తాగి పడుకుంటారని సంతోష పడుతూ ఉంటుంది రుక్మిణి. ఇంతలో కృష్ణ వచ్చి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు నీ ప్లాన్ వర్కౌట్ అయిందా అని కృష్ణ అడుగుతుంది.
నువ్వు పాలలో మత్తుమందు కలపడం నేను చూశాను అందుకే ఆ పాలు నేను మార్చి వేరే పాలు ఇచ్చాను ఆ పాలు తాగి తరువాత మురిపాలు పంచుకుంటారు శ్యామ్ రాధా, నీ గురించి నాకు తెలియదా నీ ఎత్తుకు పై ఎత్తు వేశాను ఎలా ఉంది నా ప్లాన్ అని కృష్ణ అంటుంది. నేను శ్యామ్ కలిసి రాదా ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదని తను గర్భవతని నాటకం ఆడితే నువ్వు బయట పెట్టావు కానీ ఇప్పుడు దీన్ని ఎలా ఆపగలవు పైగా నువ్వే నీ చెల్లెల్ని తీసుకువెళ్లి శ్యామ్ గదిలో వదిలేసి వచ్చావ్ చూసావా భగవంతుడు శ్యామ్ రాదకి రాసిపెట్టి ఉంది కాబట్టే రాధా ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా శ్యామ్ ప్రాణానికి తనకు పుట్టబోయే బిడ్డకి ముడిపెట్టి వాళ్ళిద్దర్నీ ఒకటి చేశాడు అని కృష్ణ అంటుంది.చూడు నీ బుద్ధి రాధకి తెలిసే టైం దగ్గర్లోనే ఉంది ఇంకా ఏం చేసిన వాళ్ళని విడదీయలేవు అంటూ కృష్ణ వెళ్లిపోతుంది.ఎన్ని ప్లాన్లు వేసి వాళ్లను కలవనివ్వకుండా చేద్దామంటే అంతా వేస్ట్ అయిపోయింది ఈ కృష్ణ ప్లాన్నంత పాడు చేసింది ఇప్పుడు వాళ్ళు ఒకటే పోతే నా పరిస్థితి ఏంటి అలా జరగకూడదు అని రుక్మిణి అనుకుంటుంది. కట్ చేస్తే, ఏంటి రాధా మళ్లీ మౌనవ్రతమా అని శ్యామ్ అంటాడు. నాకు దగ్గర అవడానికి ఇన్ని రోజులు పట్టిందా రాదా నీ మనసులో ప్రేమని ఇప్పటికైనా తెలుపొచ్చు కదా ఇంకా మౌనం ఎందుకు అని శ్యామ్ అంటాడు. రాధా ఏమి మాట్లాడకుండా అలాగే నిలబడుతుంది. శ్యామ్ తనని ముద్దు పెట్టుకోబోతూ ఉండగా శ్యామ్ ని పక్కకు నెట్టేస్తుంది రాదా.
ఏంటి రాధా ఇలా చేశావు అని శ్యామ్ అంటాడు. నాకు నచ్చట్లేదండి అని రాదా అంటుంది. ఇంత దూరం వచ్చాక కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాదా నా ప్రాణాలు కాపాడాలని నీకు లేదా అని శ్యామ్ అంటాడు. ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టిన నేను ఏమీ అనలేదు నా ప్రాణాల మీదికి వచ్చినా కూడా నువ్వు ఎందుకు రాదా ఇంక నన్ను దూరం పెడుతున్నావ్ మనకు పుట్టబోయే బిడ్డ వల్లనే కదా నాకు పూర్ణ ఆయుష్షు వస్తుంది మనకు బిడ్డ పుట్టకూడదని చేస్తున్నావా అని శ్యామ్ అంటాడు. మీ ప్రాణాలు కాపాడాలని ఉంది సార్ అందుకే మనస్ఫూర్తిగా వచ్చాను కానీ నేను చేస్తున్నది తప్పని నా మనసుకు అనిపిస్తుంది అని రాదా అంటుంది.
నా ప్రాణం కన్నా మీ అక్కే ఎక్కువ అయిపోయిందా రాదా నీకు మనకు బిడ్డ పుట్టకపోతే యాగం జరగదు జరగకపోతే నేను చచ్చిపోతాను అప్పుడు మీ అక్కకు ఏ న్యాయం జరగదు నువ్వు అనుకుంటున్నాదంతా తప్పు రాదా ఎవరికి న్యాయం జరగదు నేనే అన్యాయంగా చచ్చిపోతాను అని శ్యామ్ అంటాడు. మీరు అలా మాట్లాడకండి సార్ మీ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు నీ ప్రాణాల్ని నేను ఎలాగైనా సరే కాపాడుకుంటాను అని రాదా అంటుంది. ఎలా కాపాడుకుంటావు రాదా నన్ను దూరం పెడితే మనకు బిడ్డ పుట్టదు అప్పుడు యాగం జరగదు అప్పుడు నా చావే కదా చూస్తావ్ నా చావే నీకు కావాలా అప్పుడు మీ అక్కకు న్యాయం జరుగుతుందా అని శ్యామ్ అంటాడు.
మీరు మాటిమాటికి అలా మాట్లాడకండి సార్ నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుకుంటాను మిమ్మల్ని చావనివ్వను. అని రాదా మంగళ సూత్రాలకి నమస్కారం పెట్టుకుంటుంది. గురువుగారు జాతకం చూసి ఏం చెప్పారు రాధా నీకు నాకు బిడ్డ పుడితే కానీ యాగం జరగదు యాగం జరిగితే కానీ నా ప్రాణాలు నిలబడవు అని చెప్పాడు కదా అంత తెలిసిన నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి నా ప్రాణం పోయిన తర్వాత మీ అక్కకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఎవ్వరికి న్యాయం జరగదు రాదా అని శ్యామ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!