Madhuranagarilo March 11 2024 Episode 309: పండు పిలిచి పిలిచి ఆకలి వేసి దాహం వేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. పిల్లవాడి మాట వినపడట్లేదు ఆకలితో కింద పడిపోయి ఉంటాడు డోర్ తీయవే అని నాగమణి అంటుంది. చెప్పాను కదా వాడు అమ్మ అని పిలిచేదాక డోర్ తీయను అని రుక్మిణి అంటుంది. నువ్వు అసలు కన్నతల్లివేనా పిల్లవాడు స్పృహతప్పి పడిపోయినట్టున్నాడు ముందు డోర్ తీ అని మురళి గట్టిగా బెదిరిస్తాడు. రుక్మిణి డోర్ ఓపెన్ చేస్తుంది. వెళ్లి చూసేసరికి పాండు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు.కంగారుపడిపోయిన నాగమణి పండుని లేపుతుంది. అమ్మమ్మ నాకు ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టవా అని పండు అంటాడు. నాగమణి వెళ్లి అన్నం తీసుకొచ్చి పండుకు తినిపించబోతూ ఉండగా రుక్మిణి తన చేయి పట్టుకుని ఆపుతుంది. ఎందుకే అన్నం పండుకి తినిపించనివ్వట్లేదు అని నాగమణి అంటుంది.
వాడు నన్ను అమ్మ అని పిలిచే దాకా వాడికి అన్నం పెట్టనని చెప్పాను కదా అని రుక్మిణి అంటుంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడవ0టే బాగోదు అని నాగమణి పండు కి అన్నం తినిపిస్తుంది. రుక్మిణి కోపంగా బయటికి వెళుతుంది. కట్ చేస్తే, కన్న కొడుక్కి అన్నం పెట్టొద్దంటూద అసలు నువ్వు తల్లివేనా ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ నీకు అసలు బుద్ధుందా అని నాగమణి అంటుంది. అమ్మ నేను వాడికి అన్నం పెట్టననడం లేదు నన్ను అమ్మ అని పిలవమనండి ఇప్పుడే నా చేతులతో నేనే తినిపిస్తాను అని రుక్మిణి అంటుంది. ఆ మాట అనడానికి నీకు బుద్ధుందా ఆస్తిని ఇస్తే కన్న కొడుకుని ఇచ్చేస్తానన్నావు నువ్వు అసలు కన్నతల్లివేనా కన్నతల్లి వైతే అలా మాట్లాడవే డబ్బు కోసం కన్న పేగును అమ్ముకుంటావా ఆస్తి కన్నా పేగుమందం గొప్పది ప్రేమ గొప్పది అవి లేనినాడు ఆస్తిని తీసుకొని ఏం చేసుకుంటావే అవి ఉంటేనే ఆడదానికి అందం అర్థం జీవితానికి ఓ పరమార్థం అవి లేని నాడు నీ దగ్గర డబ్బు ఉన్న నువ్వు పేదరాలివేనే అంటూ నాగమణి కోపంగా వెళ్ళిపోతుంది.
చెల్లెలి కాపురాని పాడుచేసి నువ్వు ఆనందంగా ఉంటావా ని భర్తని వదిలేసి చెల్లెలు కాపురాన్ని పాడుచేసి ఇంట్లో పడి తింటుందని నలుగురు నాన్న రకాలుగా అనుకుంటారు మొగుడు వదిలేసిన ఆడదానివని నీకు సమాజంలో గౌరవం ఇవ్వరు అని మురళి రుక్మిణిని కోప్పడతాడు.కట్ చేస్తే,రాధా పండు కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది అలా వెళ్తూ ఉండగా ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది ఒక్కసారి పండు గుర్తుకు వస్తాడు రాధకి. ఇంతలో పండు రోడ్డు నుంచి పిలిచినట్టు వినపడుతుంది. అది విన్న రాదా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కారు తనని యాక్సిడెంట్ చేయబోతుంది, వెంటనే శ్యామ్ వచ్చి తన చేయి పట్టి లాగుతాడు.ఏంటి రాధ ఇది ఇంత పరధ్యానంలో నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న యాక్సిడెంట్ అయితే ఏం కావాలి అని శ్యామ్ అంటాడు.ఇక్కడే పండు నన్ను పిలిచినట్టు వినిపించిందండి పెద్దమ్మని వదిలేసి నీకోసం వచ్చానమ్మా అని పిలిచాడు అందుకే పరిగెత్తుతున్నాను అని రాదా అంటుంది.
పిచ్చి పట్టిందానిలా ప్రవర్తిస్తున్నావు రాదా అని శ్యామ్ అంటాడు. అవును నాకు పిచ్చే పట్టింది పండు లేకపోతే నాకు నిజంగానే పిచ్చి పడుతుంది నాకు నా పండు కావాలండి నాకు ఇంకేం అక్కర్లేదు అని రాదా బాధపడుతుంది.రాధా ముందు ఇంటికి వెళ్దాం పద పండుని తీసుకొస్తాను అని శ్యామ్ రాదని ఇంటికి తీసుకు వెళ్తాడు.కట్ చేస్తే,రాధా బయటికి వెళ్లిందా శ్యామ్ ఎక్కడికి వెళ్ళాడు అని మధుర అడుగుతుంది. రాధా బయటికి వెళ్ళింది అని చెబితే రాధ కోసం శ్యామ్ వెళ్ళాడు వదిన అనే దాక్షాయని చెబుతుంది. చెప్పకుండా ఎక్కడికి వెళ్లినట్టు అని మధుర అంటూ ఉండగా శ్యామ్ రాధా ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారు అని మధుర అడుగుతుంది. రాధా పరధ్యానంలో రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుందిమ్మ పండు కోసం కొంచమైతే యాక్సిడెంట్ అయ్యేది అని శ్యామ్ చెబుతాడు. ఏంటి రాధా నీకేమన్నా జరిగితే మా పరిస్థితి ఏంటి అని మధుర అంటుంది.
అత్తయ్య ఇప్పుడు నా గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను నా బిడ్డ లేంది నేను ఉండను బ్రతకలేను నాకు నా బిడ్డ కావాలి అని రాదా ఏడుస్తుంది. రాధా నువ్వేం బాధపడకు అమ్మ ఎలాగో అలా పండుని తీసుకొద్దాం అని మధుర రాదని ఓదారుస్తుంది. రాధా నువ్వేం బాధపడకు మన ఆస్తినంత ఇచ్చేసి పండుని తీసుకొస్తాను,నువ్వేమంటావు నాన్న పండు కోసం ఆస్తిని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని శ్యామ్ అంటాడు. రాధ కన్నా పండు కన్నా మనకు ఆస్తి ఎక్కువేం కాదురా వెళ్లి ఆస్తినిచ్చి పండుని తీసుకురా అని ధనంజయ్ అంటాడు. రాధా పండుని ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను నువ్వేమీ బాధపడకు అంటూ శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, రుక్మిణి దోశలు తింటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అక్కడికి వస్తాడు. మీ అల్లుడు వస్తున్నాడు మర్యాదలు చేయండిని రుక్మిణి లోపలికి వెళుతుంది.
అల్లుడు గారు రండి కాఫీ తాగుతారా అని మురళి అంటాడు. ఏది వద్దు మామయ్య గారు ఆవిడ ఎక్కడ అనిశ్యామ్ అంటాడు. మీ ఆవిడ అని రుక్మిణి అంటుంది. నీకంత అదృష్టం లేదులే నా భార్య నువ్వు కాదు అని శ్యామ్ అంటాడు. నేను నీకు రాధ కంటే ముందు నీకు భార్యని ఆ తర్వాతే ఇప్పుడు రాదా నీకు భార్య అయింది అని రుక్మిణి అంటుంది. ఆ మాట అనడానికి నీకు బుద్ధి లేదు నేను నీ చెల్లెలు భర్తని ని శ్యామ్ అంటాడు. ఇప్పుడు రాధ నీకు భార్య అయింది తనకంటే ముందు నేనే కదా నీకు భార్యని అని రుక్మిణి అంటుంది.ఆస్తినంతా ఇస్తే పండుని ఇస్తానన్నావు కదా ఆస్తి మొత్తం నీకిచ్చేస్తాను పండు నిచ్చె అని శ్యామ్ అంటాడు. అది ఇంతకుముందు మాట ఆస్తితో పాటు నా భర్త కూడా కావాలి అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!