ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఎంతటి పాపులారిటీ దక్కించుకున్నాడు మనందరికీ తెలిసిందే. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం మహేష్ లైన్ అప్లో రాజమౌళి సినిమా ఉన్న సంగతి తెలిసిందే.
చిన్న జలక్ ఇచ్చి తొందర్లో బాక్స్ ఆఫీస్లు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు మహేష్. ఇందుకోసమే సంవత్సరం పాటు తన బాడీ ఫిట్నెస్ ని పెంచుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మహేష్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేటి సమాజంలో టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ టెక్నాలజీలో భాగమైనదే ఫోన్ పే మరియు గూగుల్ పే. గూగుల్ పే ని కొందరు వాడుతున్నప్పటికీ ఫోన్పే మాత్రం ప్రతి ఒక్కరి ఫోన్లోను ఉంటుంది.
అంతలాగా ఆదరణ పొందింది మరి ఫోన్ పే. టీ షాప్ నుంచి స్టార్ హోటల్ వరకు ప్రతి చోట పేమెంట్ ని ఫోన్ పే ద్వారానే పంపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఫోన్పే అధికారులు ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సాధారణంగా ఒక్కసారి పేమెంట్ పూర్తయిన అనంతరం ఒక చిన్న మ్యూజిక్ సౌండ్ వస్తు ఉంటుంది. ఇక మీరు కనుక హోటల్స్ మరియు ఇతర వాటిలో పేమెంట్ చేసినప్పుడు ఒక స్పీకర్లో అమౌంట్ చెబుతూ ఉంటుంది.
తాజాగా ఆ సౌండ్ ప్లేస్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ ని జమ చేశారు అధికారులు. ఇకనుంచి ఫోన్ పే లో మహేష్ గొంతు వినిపించనుంది. మీరు మనీ వేసిన వెంటనే..” 50 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురువుగారు ” అని ఒక డైలాగ్ ద్వారా ప్రతి ఒక్కరిని పలకరించనున్నాడు. ఇక ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు ఫోన్పే అధికారులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!