ప్రస్తుతం దేశవ్యాప్తంగా మల్టీస్టారర్, పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు దర్శకులు మరియు హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్, పాన్ ఇండియా ప్రాజెక్టులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా కింగ్ నాగార్జున కొడుకు అఖిల్ తో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇది నాగార్జున కెరియర్ లో 100వ సినిమా అని అంటున్నారు. గతంలో నాగార్జున కుటుంబం అంతా కలిసి “మనం” సినిమా చేయడం జరిగింది. అందులో చివరిలో అఖిల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇంకా అఖిల్ పూర్తిస్థాయిలో హీరోగా సినిమాలకి ఎంట్రీ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం తన 100వ సినిమాలో అఖిల్ కి చాలా డిఫరెంట్ పాత్ర నాగార్జున ప్లాన్ చేసినట్లు కొడుకుతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్..కి ఇప్పటికీ సరైన హిట్ పడలేదు. అందం ఇంకా డాన్స్, ఫైట్స్ పరంగా సూపర్ టాలెంట్ ఉన్నాగాని.. అభిమానులు మాత్రం అఖిల్ తన స్థాయికి తగ్గ హిట్టు కొట్టలేదని అంటున్నారు. అదే ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ “ఏజెంట్” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమాలో “అఖిల్” చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. జేమ్స్ బాండ్ తరహాలో అఖిల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. మరి “ఏజెంట్” తో అఖిల్ ఎటువంటి విజయం సాధిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే నాగార్జున తన 100వ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం అంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు..టాక్.
ఈ సినిమాలో తనకి తగ్గట్టుగానే అఖిల్ కి మంచి క్యారెక్టర్ నాగార్జున దగ్గరుండి డిజైన్ చేసినట్లు టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 1986లో “విక్రమ్”తో నాగార్జున హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాదాపు 36 సంవత్సరాలు పాటు.. దిగ్విజయంగా హీరోగా రాణిస్తున్నరు. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా ఇంకా వ్యాపారవేత్తగా కూడా విజయవంతమైన కెరియర్ తో నాగార్జున దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో నాగార్జున సినిమా విషయంలో అభిమానులు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.