నాని వైవిధ్యమైన కథా చిత్రాలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనపరుస్తుంటారు. ఆ కోవలో తన 25వ చిత్రంగా `వి` సినిమాను ప్రకటించారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇదొక మల్టీస్టారర్. తనతో తొలిచిత్రం `అష్టాచమ్మా`ను తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనుంది. మల్టీస్టారర్లో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నారు. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్. సోమవారం సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి జరగనుంది. శ్రీమతి అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మన్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దిల్రాజు, శిరీష్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు `ఎంసిఎ` డైరెక్టర్ శ్రీరామ్ వేణు క్లాప్ కొట్టగా.. `నేను లోకల్` దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్ఛాన్ చేశారు. `ఎఫ్2` డైరెక్టర్ అనీల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!