విజయ్ దేవరకొండ క్రేజ్ టాలీవుడ్లో పీక్ దశకు చేరుకుంది. చేసే ప్రతి సినిమాను విజయ్ దేవరకొండ పక్కా ప్లానింగ్తో రూపొందేలా చూసుకుంటున్నాడు. ఏకంగా తన సినిమాలను దక్షిణాది భాషల్లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. `డియర్ కామ్రేడ్` నుండి తన ప్లాన్స్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు త్వరలోనే మరో దక్షిణాది సినిమాలో కూడా విజయ్ నటించబోతున్న సంగతి తెలిసిందే.
`నోటా` సినిమాతో తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజ్ సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ `నోటా` పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో `డియర్ కామ్రేడ్` విషయంలో తన లెక్క తప్పకూడదని విజయ్ అనుకుంటున్నాడట. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రషెష్ చూసిన విజయ్ దేవరకు కొన్ని సన్నివేశాలు అసలు నచ్చలేదట. దాంతో ఆ సన్నివేశాలను రీ షూట్ చేయాలని కోరుతున్నాడట. ఈ లెక్క ప్రకారం చూస్తే డియర్ కామ్రేడ్ మరింత ఆలస్యం అయ్యేలానే కనపడుతుంది.
భరత్ కమ్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!