balayya: సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలంటే వందలు సినిమాలు చేయవసరం లేదు. చేసిన ఒక్క సినిమాలో అయినా తమ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటే సరిపోతుంది. అలా ఒక్క సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ..శ్రద్ధ శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాని హీరోగా నటించిన ” జెర్సీ ” మూవీలో హీరోయిన్గా నటించిన శ్రద్ధ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ఈ మూవీ అనంతరం ఈమెకి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ వాటికి ఓకే చెప్పలేదు శ్రద్ధ. ఇందుకు కారణం ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. జెర్సీ కన్నా మంచి కథ అనుకుంటేనే నేను ఆ సినిమాలో నటిస్తాను.. లేదంటే ఖాళీగా అయినా ఉంటాను కానీ ఫ్లాప్ సినిమాలలో నటించను… అని చెప్పుకొచ్చింది శ్రద్ధ. ఇక తాజాగా వెంకటేష్ హీరోగా నటించిన ” సైంధవ్ ” మూవీలో హీరోయిన్ గా నటించి ర్రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
కానీ ఇది దారుణమైన ఫ్లాప్ అవ్వడంతో ఈమె కెరీర్ పూర్తిగా పోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఆ సినిమా ఎఫెక్ట్ ఈమెపై ఇంచు కూడా పడలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య సరసన నటించనుందట. బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయకగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇక ఈ ముద్దుగుమ్మ ఆల్రెడీ సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతుంది. ఇక ఈ బ్యూటీ బాలయ్యతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరి కాంబో కనుక థియేటర్లోకి వస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఒకపక్క జెర్సీ మూవీతో బాక్సాఫీస్లు బద్దలు కొట్టిన శ్రద్ధ.. మరో పక్క భగవంత్ కేసరి తో ఊచ కోత కోసిన బాలయ్య.. వీరిద్దరూ కలిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే…!
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!