తెలుగులో నాని హీరోగా రూపొందిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ కానుంది. అల్లు అరవింద్, దిల్రాజు, అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి, హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రీమేక్లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 28న సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. రీసెంట్గా బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా `కబీర్సింగ్` సినిమా కూడా తెలుగు సినిమా `అర్జున్రెడ్డి`కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ రీమేక్లో నటించిన షాహిద్..ఇప్పుడు వెంటనే మరో రీమేక్లో నటించబోతున్నాడు మరి.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!