హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తున్నది. గవర్నర్ తమిళసై నేడు ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించనున్నారు. ఆర్టిసి కార్మికుల సమ్మె నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ విద్యాసంస్థలకు దసరా సెలవులను పొడిగించింది.
రాష్ట్రంలో ఆర్టిసి కార్మికుల సమ్మెకు బిజెపి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. కార్మికుల నిరసన కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు బిజెపి నేతలు పాల్గొని సంఘీభావం తెలియజేస్తున్నారు. ఆర్టిసి కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలియజేస్తూ రాష్ట్ర బిజెపి కార్మికుల సమ్మెపై కేంద్రానికి నివేదక ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్మికుల సమ్మెపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని బిజెపి రాష్ట్ర నేత లక్ష్మణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు గవర్నర్ తమిళసై హస్తినకు బయలుదేరారు.