Nindu Noorella Saavasam February 28 2024 Episode 171: మిస్సమ్మ పెళ్లి బాగా జరగాలని వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని రా అమ్మ అని నిర్మల చెబుతుంది. ఈ పెళ్లి మా నాన్న కోసం చేసుకుంటున్న పెళ్లి ఆంటీ ఆయన లేకుండా సంతోషంగా ఎలా ఉంటాను అని భాగమతి బాధపడుతుంది. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్లి దండం పెట్టుకొని రా దేవుడికి అని మంగళ పంపిస్తుంది భాగమతిని. కట్ చేస్తే, రాథోడ్ మెకానికల్ తీసుకొని కార్ దగ్గరికి వస్తాడు. ఇదే కారు చూడవయ్యా ఏమైందో అని రాథోడ్ అంటాడు. రాథోడ్ అంతా చూస్తాడు కానీ మనోహరి పిల్లలు కనిపించలేదు కంగారు పడిపోయిన రాథోడ్ వెంటనే మనోహరి కి ఫోన్ చేస్తాడు. కానీ మనోహరి ఫోను ఎత్తదు. ఈవిడ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి సార్ చెప్పాలి అని రాథోడ్ అమరేంద్ర కి ఫోన్ చేస్తాడు. ఏంటి రాథోడ్ ఇంకా రాలేదు ఏమైంది అని అమరేంద్ర అడుగుతాడు. రాథోడ్ జరిగిన విషయం అంతా చెబుతాడు. మనోహరి కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు సార్ ఎక్కడున్నారో తెలియదు అని రాథోడ్ అంటాడు. ఫోన్ ఎత్తట్లేదు నేను ట్రై చేస్తాను అని అమరేంద్ర మనోహరి కి ఫోన్ చేస్తాడు. భాగీ పెళ్లి అయ్యేదాకా నీ ఫోను లిఫ్ట్ చేయను అమర్ అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది.
నా ఫోన్ కూడా ఎత్తడం లేదు ఏంటి అని అమరేంద్ర అనుకుంటాడు. కట్ చేస్తే, ఇంతలో ఒక ఫోను రింగ్ అవుతుంది. నీ ఫోను మొగట్లేదు నాకు ఫోన్ రావట్లేదు కానీ సౌండ్ వస్తుంది ఎక్కడినుంచి అని మనోహరి అంటుంది. నా దగ్గర నుంచి ఆంటీ అని అంజలి ఫోను లిఫ్ట్ చేస్తుంది. హలో అంజు ఎక్కడున్నారమ్మ మనోహరి ఆంటీ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అని అమరేంద్ర అంటాడు. ఆంటీ డాడీ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అంట ఎందుకు అని అంజలి అడుగుతుంది. సైలెన్స్ లో పడింది చూసుకోలేదు అని మనోహరి అంటుంది. హలో డాడీ చెప్పండి అని అంజలి అంటుంది. ఇప్పుడు ఎక్కడున్నారమ్మ అని అమరేంద్ర అంటాడు. రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం డాడీ లెఫ్ట్ తీసుకుంటే గుడి దగ్గరికి వస్తాము 15 నిమిషాల్లో అక్కడే ఉంటాం డాడీ నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నాను చూడండి అని అంజలి అంటుంది. త్వరగా వచ్చేయండి అని అమరేంద్ర అంటాడు. అంజలి నీ దగ్గర ఫోన్ ఎక్కడిది అని మనోహరి అడుగుతుంది. అమ్మ నాన్న దగ్గర లేనప్పుడు ఈ ఫోన్ యూస్ చేసుకోమని డాడీ చెప్పాడు ఆంటీ నాన్న ఇప్పుడు మా దగ్గర లేడు కాబట్టి ఈ ఫోన్ నేను తీసుకొచ్చాను అని అంజలి చెబుతుంది. అది సరే నీకు లైవ్ లొకేషన్ పెట్టడం ఎలా వచ్చు అని మనోహరి అడుగుతుంది.
మా అమ్మ నేర్పించింది ఆంటీ అని అంజలి చెబుతుంది. నేను ఎప్పుడో నేర్పిస్తే ఇంకా గుర్తుపెట్టుకున్నావా నా బంగారు తల్లి అని అరుంధతి అనుకుంటుంది. మనోహరి మంగళ కి ఫోన్ చేస్తుంది. హలో మేడం పెళ్లికి ఆ అమ్మాయి రావట్లేదు కదా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని మంగళ అంటుంది. నన్ను హలో అని కూడా అననివ్వరా 15 నిమిషాల్లో గుడికి వచ్చేస్తాం అలోగా ఏం చేయాలో మీరే చూసుకోండి అని మనోహరి అంటుంది. అంజలి పాప పెళ్లికి వస్తుందా అని మంగళ అంటుంది.తొందరగా రావడానికి ప్రయత్నించామండి కానీ కుదరలేదు అర్థం చేసుకోండి అని మనోహరి అంటుంది.కట్ చేస్తే,ఈ అంజలి ఇప్పుడు పెళ్లికి వస్తే నా తమ్ముని చూసేస్తుంది వాడి పెళ్లి మొగాని తద్దినం ఇక్కడే అవుతుంది అని మంగళ పరిగెత్తికెళ్ళి పంతులుగారు ఇంకా ఎంతసేపు మంత్రం చదువుతారు పెళ్లి కాని చేసేయండి అని అంటుంది. పెళ్లికి ఇంకా టైం ఉందమ్మా అని పంతులుగారు అంటారు. పెళ్లి చేసుకునే వాడికి లేని బాధ నీకెందుకండీ తొందరగా పెళ్లి కాని చేయండి అని మంగళ తొందర పెడుతుంది. అన్నీ సక్రమంగా చేస్తేనే పెళ్లి చేసుకున్న జంట బాగుంటారమ్మా అని పంతులుగారు చెబుతారు.
ఆంటీ ఏమైనా ప్రాబ్లమా అని అమరేంద్ర అడుగుతాడు. ఏమీ లేదు అని మంగళ అంటుంది. పెళ్లంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు కాదండి మనస్ఫూర్తిగా చేసుకొని అన్ని సక్రమంగా పూజలు చేసి అందరి సమక్షంలో ఒకటయ్యే జంట ఆనందంగా ఉంటారు అలాంటి పెళ్లిని తూతూ మంత్రంగా జరిపించమంటారేంటి అని అమరేంద్ర అంటాడు. పంతులుగారు ఏం పర్వాలేదు పెళ్లి సవ్యంగా జరిపించండి అని అమరేంద్ర అంటాడు. పంతులుగారు భజంత్రీలు మోగించమంటాడు. కట్ చేస్తే, రామ్మూర్తి రోడ్డు మీద అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అటుగా వస్తూ ఉంటే రామ్మూర్తి వెళ్లి కారు మీద పడతాడు. ఎవరు అయ్యా నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని రాథోడ్ అంటాడు. రాథోడ్ చూసేసరికి అతను వాచ్మెన్ అని కనిపెట్టి ఏంటి సార్ మీరు ఇక్కడ ఏమైంది మీకు అని అంటాడు. సార్ మీకు ఆరోగ్యం బాగోలేనట్టుంది మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాను అని రాథోడ్ అంటాడు. వద్దు నా కూతురు పెళ్లి ఇక్కడ జరుగుతుంది ఆపాలి అని రామ్మూర్తి అంటాడు. మీ కూతురు పెళ్లి ఆపడం ఏంటి సార్ అని రాథోడ్ అంటాడు.ఇక్కడ అమ్మవారి టెంపుల్ లో భాగీ పెళ్లి జరుగుతుంది అని రాథోడ్ అంటాడు. ఆ భాగి నాకు త్రు తన పెళ్లి ఆపాలి తొందరగా తీసుకువెళ్ళు అని రామ్మూర్తి అంటాడు.
భాగి మీ కూతురా ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా అసలు ఏం జరుగుతుంది అని రాథోడ్ అంటాడు. భాగి నా కూతురే తన పెళ్లి ఎలాగైనా ఆపాలి అని రామ్మూర్తి మాట్లాడలేక మాట్లాడుతాడు. ఈ విషయం వెంటనే సార్ కు చెప్పాలి అని రాథోడ్ అమరేంద్ర కి ఫోన్ చేస్తాడు. భజంత్రీలు మోగుతూ ఉండడంతో అమరేంద్ర కి ఫోను వినపడక ఫోన్ ఎత్తడు. సార్ ఫోన్ ఎత్తట్లేదు ముందు మనం గుడి దగ్గరికి వెళ్దాం పదండి అని రాథోడ్ రామ్మూర్తిని కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు. కట్ చేస్తే, పిల్లలు కారు దిగి గబగబాగుల్లోకి పరిగెడతారు. మనోహరి మంగళ కి ఫోన్ చేసి పిల్లలు వచ్చేస్తున్నారు నువ్వే చూసుకో అని అంటుంది. పిల్లల్ని ఎలాగు ఆపలేను మా తమ్ముని బయటికి పంపిస్తాను అని మంగళ ఖాళీ దగ్గరికి వెళ్లి రేయ్ అంజలి వస్తుందంట నువ్వు అర్జెంటుగా బయటకి వెళ్ళిపో అని చెబుతుంది. పంతులుగారు నాకు అర్జెంట్గా వాష్ రూమ్ వస్తుంది వెళ్ళొస్తాను అని ఖాళీ వెళ్ళిపోతాడు. పెళ్లి అని రాత్రి బిర్యానీ తిన్నాడండి అందుకే పొద్దున్నుంచి బాత్రూం పోతూనే ఉన్నాడు అని మంగళ అంటుంది. పిల్లలు పరిగెత్తుకొచ్చి డాడీ ఇంకా పెళ్లి అవ్వలేదా పెళ్లి అయిపోతుందని టెన్షన్ పడం అని అంటారు.
మీరు రాకుండా మిస్సమ్మ పెళ్లి ఎలా జరుగుతుంది పిల్లలు అని నిర్మల అంటుంది. మిస్సమ్మ ఎక్కడ అని అంజలి అడుగుతుంది. తన రూమ్ లో ఉంది వెళ్ళండి అని అమరేంద్ర అంటాడు. పిల్లలు భాగమతి దగ్గరికి వెళ్తారు. మీ తమ్ముడు ఎక్కడ అని మనోహరి అడుగుతుంది. అంజలిని ఆపలేనని మా తమ్ముని బయటికి పంపించాను అని మంగళ చెబుతుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆగకూడదు అని మనోహరి అంటుంది.ఏంచేయాలమ్మా అని మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ పెళ్లి కొడుకు వస్తే కానీ పెళ్లికూతుర్ని తీసుకురాలేము ముందు అబ్బాయిని తీసుకురండి అని పంతులుగారు చెబుతారు. మా తమ్ముని నేను తీసుకొస్తాను అంటూ మంగళ వెళుతుంది. ఏమను ఏం చేయాలనుకుంటున్నావే భాగికి ఖాళ్లి కి పెళ్లి చేయడానికి నీకు ఏంటే సంబంధం అసలేం జరుగుతుంది అని అరుంధతి గుడిలోకి రాలేక బయట నిలబడి చూస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!