NTR: బాహుబలి సిరీస్ తర్వాత దర్శకులు అందరూ ఆ తరహా పాన్ ఇండియన్ కథలతో సినిమాలు తెరకెక్కించాలని..హీరోలందరూ అలాంటి కథల్లో నటించాలని ఆరాటపడుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుంచే టాలీవుడ్ మేకర్స్లో అలాంటి భారీ కథలను సినిమాలుగా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్స్గా మారారు. దాంతో ఈ హీరోలతో భారీ బడ్జెట్తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ హీరోగా కొరటాల శివ ఓ పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారట. అంతేకాదు ప్రశాంత్ నీల్ – మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఎన్.టి.ఆర్ హీరోగా మరో పాన్ ఇండియన్ సినిమా నిర్మించనున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ హీరోగా రూపొందనున్న ఈ మూడు సినిమాలు సోలో హీరోగా రూపొందేవే. అయితే, గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిన పరశురామ్ పెట్లా ఇప్పుడు ఎన్.టి.ఆర్తో మల్టీస్టారర్ కథను సిద్దం చేశాడట.
NTR: సినిమా చేసేలా పరశురామ్ పెట్లాకు ఒప్పందం ఉంది.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్కు చేరుకున్న ఈ సినిమాను మే 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత ఎన్.టి.ఆర్ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ సినిమా ఉంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. మరో ఎవరనేది ఇంకా తెలియనప్పటికీ ఓ స్టార్ హీరో నటిస్తాడని మాత్రం టాక్ వినిపిస్తోంది. శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాల తర్వాత కూడా ఇదే సంస్థలో మరో సినిమా చేసేలా పరశురామ్ పెట్లాకు ఒప్పందం ఉంది. దాని ప్రకారమే ఈ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!