కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. దాదాపు నెల రోజుల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాల సర్కార్లు సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినా కూడా ఎవరు ముందుకు రాలేదు. చోటామోటా సినిమాలు ఏవో చిన్నచిన్న షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటే.. పెద్ద సినిమాలు ఒక్కటి కూడా ముందుకు కదల్లేదు. అయితే మార్చి నెలలో అకస్మాత్తుగా షూటింగ్ ఆగిపోయిన పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ మళ్లీ సెప్టెంబర్ నెలలో మొదలవుతున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే… పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” షూటింగ్ సెట్స్ కు వెళ్ళనున్నాడని…. నిర్మాతలు షూటింగ్ మొదలు పెట్టేందుకు మరియు అత్యంత సురక్షితమైన రూము డ్రామా సన్నివేశాలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇక శృతి హాసన్ మరియు పవన్ కళ్యాణ్ కరోనా నిబంధనల మధ్య అదే రూమ్ లో షూటింగ్ జరిగినన్ని రోజులు ఉంటారని తెలుస్తోంది.
కోవిడ్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటారని నిబంధనలకు అనుకూలంగా షూటింగ్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. కాబట్టి కొద్దిరోజులు పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ఆ రూమ్ లోనే గడపవలసి వస్తుంది. ఎంతైనా రాజకీయ పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ కరోనా నేపథ్యంలో ఇలా చేయడం మంచిది కాదు అన్నది కొందరు సలహా. ఏదైనా పొరపాటున సిబ్బందిలో ఎవరికైనా కరోనా వైరస్ ముప్పు వచ్చిందని తేలితే ఇక అంతా పవన్ కళ్యాణ్ పైన పడతారు.
మరి పవన్ ఇంత రిస్క్ తీసుకునేంతగా నిర్మాతల వద్ద నుండి ప్రెజర్ ఉందా లేక అతనే స్వయంగా షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” హిందీలో భారీ హిట్ అయిన “పింక్” సినిమా రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తర్వాత పవన్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!