Pooja Heghde: ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు మొదటి నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ సమంత అనుష్క.. వేల జోరు తగ్గాక.. ఒక్కసారిగా సీన్ లోకి వచ్చిన పూజా హెగ్డే.. చాలామంది డైరెక్టర్లకు నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అనేక అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా సక్సెస్ఫుల్ కేర్ కొనసాగిస్తూ ఉంది. అయితే కరోనా తర్వాత పూజా హెగ్డే నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో నటించిన రాధేశ్యాం, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య రెండూ కూడా అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. దీంతో ఇప్పుడు పూజా హెగ్డే అంటే భయపడే పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొంది. ఇటువంటి తరుణంలో కీర్తిసురేష్ మాదిరిగా పూజా హెగ్డే ఇండస్ట్రీలో రాణించాలంటే ప్లాన్ వేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.
ఇప్పుడు ఇదే తరహాలో.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాలో వెంకీ చెల్లెలి పాత్రలో పూజ హెగ్డే కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. “కబీ ఈద్ కబీ దివాలి” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. త్వరలో స్టార్ట్ కానుందట. అయితే తెలుగులో ఓ పాత్రకు సంబంధించి వెంకటేష్ నటిస్తున్నట్లు.. పూజా హెగ్డే వెంకటేష్ అన్న చెల్లెలు గా చేస్తున్నట్లు వీరిద్దరి జోడి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!