ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ విషయంలో పూజా హెగ్డే టైం నడుస్తుందని చెప్పవచ్చు. చాలామంది నిర్మాతలకు మరియు దర్శకులకు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్. ఆమె సినిమాలో నటిస్తుంది అంటే చాలు కచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని చాలా బలంగా నమ్ముతారు. ఇలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో పూజ హెగ్డే నటించిన రెండు సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ తో నటించిన “రాధెష్యమ్”, ఇంకా ఆచార్య లో పూజ హెగ్డే నటించగా రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
లాక్ డౌన్ తర్వాత సినిమాల షూటింగ్ ల విషయంలో ఏ హీరోయిన్ చెయ్యని రీతిలో సాహసంగా.. ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లలో పాల్గొన్న పూజా హెగ్డే.. వాటన్నిటిని కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న పూజ హెగ్డే తన టీం తో మొన్న గోవాలో ఎంజాయ్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు లండన్ దేశంలో చక్కెర్లు కొడుతూ షాపింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. షూటింగ్లకు గ్యాప్ ఇచ్చి నచ్చిన ప్రదేశాలలో వ్యవహరిస్తూ షాపింగ్ చేస్తూ బుట్ట బొమ్మ.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటంతో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాల లిస్టు చూస్తే.. ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో సల్మాన్ ఖాన్కు జోడిగా పూజ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ…పూరీ కాంబినేషన్లో వస్తున్న “జన గణ మన” సినిమాలో పూజ హెగ్డే నటిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబి 28’లో కూడా హీరోయిన్ అవకాశం అందుకోవడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుంది. దీంతో ప్రస్తుతం పూజా హెగ్డే తన టీం అందరితో కలిసి విదేశాలలో షాపింగ్ చేస్తూ.. రిలాక్స్ అవుతుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!