డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి తన కెరీర్ మొత్తం లో పెద్ద డ్రీం అంటే తను ఎంతో ఇష్టంగా రాసుకున్న “జనగణమన” కథ ని స్క్రీన్ మీదకి తీసుకు రావడమే. ఇన్ని సినిమాలు చేసిన టాలీవుడ్ లో ఒక దర్శకుడిగా మరే దర్శకుడు సంపాదించని 100 కోట్లు సంపాదించిన అవన్ని ఇప్పటికి వరకు పూరి కి తృప్తిని ఇవ్వలేదు. కాని ఎప్పుడు ఆయన జనగణమన ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా మొహం లో ఏదో తెలియని ఆనందం..ఉత్సాహం కనిపిస్తాయి.
ఇక ఈ డ్రీం ప్రాజెక్ట్ ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని గత కొన్నేళ్ళుగా ఎదురు చూశారు పూరి. పోకిరి సినిమాతో 75 ఏళ్ళ సినిమా చరిత్రలో నెలకొన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టాడు. చెప్పాలంటే ఈ క్రెడిట్ పూరి కంటే మహేష్ కే ఎక్కువ వెళ్ళింది. ఆ తర్వాత పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిజినెస్ మాన్ తీసి మహేష్ బాబు కి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అంతే అప్పటి నుంచి మళ్ళీ పూరి మహేష్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అంతేకాదు ఆ హ్యాట్రిక్ సినిమా జనగణమన అని భావిస్తున్నారు. పూరి మనసులో ఈ సినిమాని మహేష్ బాబుతోనే చేయాలని అని అనుకున్నారు. కాని తాజా పరిణామాలు చూస్తుంటే ఫిల్మ్ నగర్ లో అందుకు భిన్నంగా వార్తలు వినిపిస్తున్నాయి. పూరి మనసు మార్చుకొని జనగణమన పార్జెక్ట్ ని బాలయ్యతో తెరకెక్కించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. ఇక పూరి విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బాలయ్య పూరి కలిసి పూరి డ్రీం ప్రాజెక్ట్ “జనగణమన” మొదలు పెడతారట. మొత్తానికి పూరి మహేష్ బాబు ఫ్యాన్స్ కి తేరుకోలేని షాకిచ్చాడని టాక్ మొదలైంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!