స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఈ చిత్రం పోస్ట్ప్రొడక్షన్ పనులు ముగించుకుని జూలై5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో…
నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ – “నేను ఈరోజు మీ ముందు నిర్మాతగా నిలబడి ఉండటానికి కారణం శ్రీహరిగారే. మహోన్నత వ్యక్తి. ఫైట్ మాస్టర్స్, దర్శకులను ఎంతో మందిని ఎంకరేజ్ చేశారు. అలాంటి వ్యక్తి నేడు ఇక్కడ లేడంటే నమ్మలేం. ఆయన పిల్లలు మంచి ప్రయాణం సాగిస్తున్నారు. శ్రీహరిగారి కొడుకుతో సినిమా తీసిన సత్యం బాబును అభినందిస్తున్నాను. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా డెఫనెట్గా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
సత్తిబాబు మాట్లాడుతూ – “శ్రీహరిగారితో నేను సినిమా చేశాను. ఆయన కొడుకు మేఘాంశ్ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
రాజారవీంద్ర మాట్లాడుతూ – `నాకు శ్రీహరి అన్నయ్యతో మంచి పరిచయం ఉంది.ఇద్దరం చెన్నైలో ఒకే దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాం. ఆయన లవ్ స్టోరీ కూడా నాకు తెలుసు. చివరి వరకు ఆయన డేట్స్ నేను చూసేవాడిని. ఆయనతోపాటు చాలా సినిమాల్లో నటించాను కూడా. ఇప్పుడు ఆయన కొడుకు మేఘాంశ్ నటిస్తున్న రాజ్దూత్ నటిస్తోన్న ఈ చిత్రం చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ – “హీరోలు, కమెడియన్స్, ఫైట్ మాస్టర్స్, నిర్మాతలు, డైరెక్టర్స్, పొలిటీషియన్స్ ఇలా చాలా మందిని ఏకతాటిపై పెట్టిన వ్యక్తి. ఆయనకు కష్టం విలువ తెలుసు. కాబట్టి మేఘాంశ్తో ఈ సినిమా చేసిన నిర్మాతలను మేఘాంశ్ ఎప్పటికీ మరచిపోకూడదు. నేను ఇలా ఉన్నాను అంటే ఆయనే కారణం. ఆయన ఎప్పటికీ రియల్ స్టారే. ఇంత మంది ఫ్యామిలీలు మేఘాంశ్కి ఇచ్చారు. శాంతి వెనుక థ్యాంక్యూ. శ్రీహరి అన్నమన అందరిలో ఉన్నారు. ఆయన్ని మరచిపోయేదే లేదు. మేఘాంశ్తో సినిమా చేసినందుకు నిర్మాతలకు థాంక్స్. వారు సినిమాతో విజయాన్ని, లాభాలను సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
డైరెక్టర్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ – “శ్రీహరిగారికి జోహార్. నన్ను మొదట దర్శకుడిగా గుర్తించిన వ్యక్తి. ఆయన హీరో కాకముందు నుండి నాకు తెలుసు. ఆయన హీరో కాక ముందు నుండి నాకు తెలుసు. ఆయన హీరోగా మారిన తర్వాత నాకు పిలిచి అవకాశం ఇచ్చిన వ్యక్తి. చివరి వరకు సొంత తమ్ముడిలా ఆదరించారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. ఈ సినిమాలో నన్ను నటించమని అడిగారు. హీరో ఎవరని అడిగాను. శ్రీహరిగారఇ అబ్బాయి మేఘాంశ్ అని చెప్పగానే మీరేం చెప్పకండి.. నేను ఆ సినిమా చేస్తానని చెప్పాను. తను చాలా ఈజ్తో చేశాడు. ఇద్దరు దర్శకులు అర్జున్, కార్తీక్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాకు మంచి టీం కుదిరింది. ఈ సినిమాతో మేఘాంశ్ పెద్ద హీరో కావాలి. నిర్మాత సత్తిబాబు పెద్ద నిర్మాతగా, దర్శకులు అర్జున్, కార్తీక్లకు పెద్ద స్థాయికి ఎదగాలి“ అన్నారు.
శ్రీరాం ఆదిత్య మాట్లాడుతూ – “ఈ కథను నాకు 4 ఏళ్ల క్రితం చెప్పారు. శ్రీహరిగారి అబ్బాయితో సినిమా చేస్తున్నామని ఏడాది క్రితం చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నాకు చాలా ఇష్టమైన నటుడు. అర్జున్, కార్తీక్ సినిమాను ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు. ఎంటైర్ టీమ్కు అభినందనలు“ అన్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ – “మా జనరేషన్ డైరెక్టర్స్ శ్రీహరిగారి వంటి గొప్ప నటుడితో సినిమాలు చేసే అవకాశాన్ని కోల్పోయాం. ఆయన ఉండుంటే నా `ఆర్.ఎక్స్ 100`లో డాడీ క్యారెక్టర్ను ఆయనతో బ్రతిమాలైనా చేయించుకుకుని ఉండేవాడిని. టీజర్ చూశాను. మేఘాంశ్లో మాసీ లుక్స్ ఉన్నాయి. ఆర్.ఎక్స్ 100 హిట్ అయినట్లే రాజ్దూత్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుతున్నాను“ అన్నారు.
తలసాని సాయి మాట్లాడుతూ – “నేను శ్రీహరిగారిని ఎప్పుడూ బాబాయ్ అని పిలిచేవాడిని. శాంతమ్మ నన్ను పెద్ద కొడుకులాగానే చూసుకున్నారు. మేఘాంశ్ పుట్టినప్పటినప్పటి నుండి నాకు తెలుసు. ఇది చాలా గర్వపడే క్షణాలు. ఆయన్ని తలుచుకోని రోజులంటు లేవు. అంత మంచి పేరున్నశ్రీహరి బాబాయ్గారి పేరుని మేఘాంశ్ నిలబెడతాడని ఆశిస్తున్నా. నేను ఆయనకు ఎప్పుడూ పక్కనే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడున్న నిర్మాతలకు కూడా మేఘాంశ్తో సినిమాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక శ్రీహరిగారిని సినిమాల్లో చూడనేమో అని అనుకుంటున్న తరుణంలో మేఘాంశ్ మా కళ్ల ముందుకు వచ్చాడు. ఈ సినిమా చేస్తున్న నిర్మాతకు థాంక్స్. బ్యూటీఫుల్ మ్యూజిక్… ఎంజాయ్ చేశాను. డైరెక్టర్స్ అర్జున్, కార్తీక్లకు అభినందనలు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
చిత్ర నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ, ` రెండేళ్ల కష్టం ఈ సినిమా. తొలి సినిమా ఇబ్బందుల్లో ఉంది. రెండవ సినిమా మొదలు పెట్టావ్ . ఏంటి నీ ధైర్యం అని కొందరు అన్నారు. నా ధైర్యం అమ్మానాన్నలు, స్నేహితులు, కుటుంబం. అందరి ధైర్యమే ఈ సినిమా. నేను గొప్ప నిర్మాత అవుతను అవుతానో? లేదో తెలియదు. కానీ అర్జున్- కార్తీక్ మంచి దర్శకులు అవుతారు. మేఘాంశ్ అద్బుతంగా చేసాడు. ఈ సినిమా అందరికీ బ్రాండ్ లా నిలవాలి. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు` అని అన్నారు.
శాంతి శ్రీహరి మాట్లాడుతూ, ` మేఘాంశ్ `భైరవ` సినిమాలో నటించాడు. అదే తన తొలి సినిమా. ఇది రెండవ సినిమా. పాఠాలు చదవడు. డైలాగులు పేజీలు బాగా చదువుతాడు. అప్పుడే అర్ధమైంది. బ్లడ్ లో నే ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత శ్రీహరిగారి పేరును నిలబెడతాడన్న నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. శ్రీహరిగారికి ఇచ్చిన సపోర్ట్ నా బిడ్డలకు ఇస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ` నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా బావ( శ్రీహరి). ఇద్దరిది 35 ఏళ్ల అనుబంధం. నాకు హైదరాబాద్ లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. శ్రీహరి నిలయం దానిపేరు. శాంతి చేతుల మీదుగా ఆ ఇల్లు ప్రారంభించింది. నిర్మాత సత్తిబాబు నాకు షాకిచ్చాడు. శ్రీహరి గారి అబ్బయితో నేను సినిమా చేయాలి? కానీ మీరేంటి అన్నా. లేదు సినిమా స్టార్ట్ అయింది చెప్పారు. మా పెద్దొడి( శ్రీహరికి పెద్ద కొడుకు) దర్శకత్వంలో చిన్నోడు హీరోగా ఓ సినిమా నిర్మిస్తా. ఎంత ఖర్చు అయినా చేస్తా అన్నారు. ఇప్పటివరకూ నేను రెండే డెత్ లు చూసా. ఎన్టీఆర్ తర్వాత. శ్రీహరి చనిపోయినప్పుడే అంత జనం వచ్చారు. 16 కిలోమీటర్ల మేర జనాలంతా నడుచుకునే వచ్చారు. ఇంటికి ఉండే అన్ని కాంపౌండ్ వాల్స్ పడిపోయాయి. అంటే మా బావ అంత అభిమానం సంపాదించుకున్నారు. తనతో జర్నీ చేసిన వారు ఎప్పటికీ మర్చిపోరు. ప్రతీ నిర్మాత బావ గురించి ఎలా మాట్లాడుకునే వారు. మేఘాంశ్ గురించి అలాగే మాట్లాడుకోవాలి. తండ్రిలా పెద్ద స్టార్ అవ్వాలి. రాజ్ ధూత్ టీమ్ లో మంచి ఫైర్ ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి ` అని అన్నారు.
హీరో మేఘాంశ్ మాట్లాడుతూ,` అమ్మనాన్నల వల్లే ఇక్కడ ఉన్నాను. డాడి లేకపోవడంతో మమ్మల్నిపెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. ఇక సినిమా విషయానకి వస్తే జనవరిలో స్టార్ట్ చేసాం. తక్కు టైమ్ లో షూటింగ్ పూర్తిచేసాం. మాదర్శకులు ఇద్దరైనా ఒకరిగా పనిచేసారు. చాలా క్లారిటీగా తీసారు. ఆదిత్య మీనన్ పవర్ ఫుల్ రోల్ చేసారు. సుదర్శన్ పాత్ర బాగా నవ్విస్తోంది. ప్రియాంక, నక్షత్రలతో పనిచేయడం వెరీ హ్యపీ. అంతా చాలా కష్టపడి పనిచేసాం. జులై 5న రిలీజ్ అవుతుంది. పైరసీ ఎంకరేజ్ చేయకండి. థియేటర్ కు వచ్చి చూడండి` అని అన్నారు.
దర్శకుడు బాబి మాట్లాడుతూ, ` శ్రీహరిలో లో దేవుడు కనిపించేవారు. భద్రాద్రి అనే సినిమాతో రైటర్ గా కెరీర్ ప్రారంభించా. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి, సినిమాలో అన్ని బాగా కుదిరాయి. మనిషి ఉన్నప్పుడు వస్తారు. కానీ ఆయన లేనప్పుడు వచ్చారంటే ఆయన ఎంత గొప్ప వారో అర్ధమవుతోంది` అని అన్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!