Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే అగ్ర హీరోగా గత కొన్ని దశాబ్దాల నుండి రాణిస్తున్నారు. 70 కి వయసు పైబడి ఉన్నా గానీ గత ఏడాది జైలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు పగలగొట్టారు. దాదాపు ఈ సినిమాకి 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రావటం జరిగాయి. దేశంలోనే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో రజనీకాంత్.. మొదటి వరుసలో ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో మొదట్లో ప్రకటన చేసి తర్వాత కొన్ని కారణాలవల్ల రాజకీయాలోకి రాలేదు. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
రజనీకాంత్ ఒకపక్క సినిమా రంగంలో రాణిస్తూనే మరోపక్క ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో భక్తి భావం కలిగిన వ్యక్తి. దీంతో సినిమాలు చేయని క్రమంలో.. హిమాలయాల్లోకి వెళ్లి ధ్యానం చేసుకుంటారు. ఈ రకంగా బయట ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మికంగా రజనీకాంత్ ఎన్నో కార్యక్రమాలు తనకు తాను రూపొందించుకుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చెన్నైలో పేదవారి ఆరోగ్యం కోసం రజనీ చాలా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందట. విషయంలోకి వెళ్తే దాదాపు 12 ఎకరాలలో ఓ భారీ ఆసుపత్రి నిర్మించడానికి డిసైడ్ అయ్యారట.
ఇందుకుగాను ఆల్రెడీ 12 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేయడం జరిగిందట. త్వరలోనే భూమి పూజ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పేదలకు ఉచిత వైద్య సదుపాయాల అందించేందుకు.. కార్పొరేట్ తరహాలో.. ఆసుపత్రిని నిర్మించి అతి తక్కువ ఖర్చుకే వైద్యం అందేలా.. రజినీకాంత్ ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని రూపొందిస్తున్నారట. దీనికోసం ఆయన తిరుపపూర్ లో.. భూమి కొనుగోలు చేయడం జరిగిందట. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆసుపత్రిని నిర్మించబోతున్నారట. ఈ ఏడాదిలోనే నిర్మాణం జరుపుకుని చివరిలో ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ నెలలో తన జన్మ దినోత్సవం నాడు ఆసుపత్రి ఓపెనింగ్ చేసే రీతిలో పనులు జరగనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.