ఈ ఏడాది చెన్నైలో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. ఒక పక్క వానలు లేవు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్లో అయితే నీళ్లు పరిమితంగానే ఇస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం చేయమంటున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ నీళ్ల సమస్య ప్రజలను డైరెక్ట్గా, ఇన్డైరెక్ట్గా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రజల సమస్యను తీర్చడం కోసం రజనీకాంత్ అభిమానులు నడుం కట్టారు. రజనీకాంత్ మక్కల్ మండ్రం అనే పేరుతో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిన నీళ్ల ట్యాంకులతో నీళ్లను సరఫరా చేయడం ప్రారంభించారు. ముందుగా సినీ కార్మికులు ఎక్కువగా ఉండే కోడంబాక్కం ప్రాంతంలో రజనీ అభిమానులు నీళ్లను సరఫరా చేస్తున్నారట.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!