`లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రం తర్వాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళపై సినిమా తీస్తానని.. ఆ సినిమా పేరు `శశికళ` అని ఇది వరకే వర్మ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదలైంది. ఆంధప్రదేశ్లో విడుదల కావాల్సి ఉంది. ఈ తంతు ఇంకా ముగియకుండానే రాంగోపాల్ వర్మ `శశికళ` గురించి మరో ప్రకటన చేశారు. `త్వరలోనే శశికళ ప్రేక్షకుల ముందుకు వస్తుంది` అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు వర్మ. అంతే కాకుండా ఓ పోస్టర్ను విడుదల చేశారు. `ప్రేమ ప్రమాదకరమైన రాజకీయం` అని దానిపై రాసి ఉండటం గమనార్హం. అయితే `శశికళ` ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వర్మ వెల్లడించలేదు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై లక్ష్మీస్ ఎన్టీఆర్తో ఫోకస్ పెట్టి వార్తల్లో నిలిచారు వర్మ. ఇప్పుడు ఆయన దృష్టి తమిళనాట రాజకీయాలపై పడింది. అయితే తమిళ తంబీలు వర్మను ఎలా స్వాగతిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!