అమరావతి, ఎప్రిల్ 1: వైసిపికి ఎన్నికల ప్రచారం నిర్వహించి సహకారం అందించేందు సినీనటులు ఒక్కరొక్కరుగా సిద్దం అవుతున్నారు. హాస్యనటుడు ఆలీ, ప్రముఖ నటి జయప్రద, మరో నటుడు రాజా తదితరులు ఇప్పటికే వైసిపి తరపున ప్రచార పర్వంలో పాలుపంచుకుంటుండగా తాజాగా జీవితా, రాజశేఖర్ దంపతులు వైసిపికి ప్రచారం చేయడానికి సిద్ద మయ్యారు.
సోమవారం జీవిత, రాజశేఖర్ దంపతులు వైసిపి అధినేత జగన్ ను కలిసి పార్టీ కండువా రప్పించుకున్నారు. సినీనటి హేమ, యాంకర్ శ్యామలలు సైతం వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో ేచేరారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత జగన్ నుకలిశానన్నారు.
కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో మా మధ్యలో తొలిగాయని తెలిపారు. అప్పట్లో తాను ఇమ్మెచ్యూర్ గా ప్రవర్తించానని అన్నారు. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు వచ్చాయని పేర్కొన్నారు.
అవి తొలగించుకోవడానికే జగన్ దగ్గరకు వచ్చానని అన్నారు.
జగన్ చాలా లవబుల్ పర్సన్ అని కితాబు ఇచ్చారు.
వైఎస్సార్ సూపర్ డూపర్ అనేలా పని చేశారనీ, ఆరోగ్యశ్రీ, రైతులకు, ఐటీ అన్నీ అభివృద్ధి చేశారని చెప్పారు.
ఇప్పుడు ఆ పులిబిడ్డ జగన్ కూడా ప్రజలకు ఆవిధంగానే పని చేస్తారని రాజశేఖర్ పేర్కొన్నారు.
పెద్దింటి బిడ్డలు ఉన్నట్లుగా జగన్ లేరనీ, సుఖపడాలని కోరిక ఆయనకు లేదని అన్నారు.
‘ఆయనకు ఎప్పుడూ కష్టపడటమే తెలుసు, నేను ఆయనను కలవడం ఆలస్యమైందని’ రాజశేఖర్ అన్నారు.
ఇప్పటికైనా ఆయనను కలవడం సంతోషంగా ఉందని అన్నారు.
జగన్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజలను కోరారు.
చంద్రబాబు కి మూడు అవకాశాలు ఇచ్చాం, కానీ టిడిపిలో అవినీతి పెచ్చుమీరిందని విమర్శించారు.
ఆయనతో పాటే ఉండి ఆయన సీఎం అయ్యే వరకు కృషి చేస్తామని జీవిత రాజశేఖర్ లు పేర్కొన్నారు.
వైసిపిలో చేరిన యాంకర్ శ్యామల దంపతులు
వైసిపిలో చేరిన సినీ నటి హేమ
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?