`మహర్షి`గా సూపర్స్టార్ మహేష్ మే 9న థియేటర్స్లో సందడి చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెండు పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ రెండు పాటలను ఏప్రిల్ 12లోపు పూర్తి చేసేస్తారు. ఈ సినిమా బిజినెస్కోసం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. లెటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను 11 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. మహేష్ గత చిత్రాల డిజిటల్ హక్కులకంటే ఈ సినిమాకే ఎక్కువ డిజిటల్ హక్కులు వచ్చాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి `చోటి చోటి బాతే.. ` అనే పాట తొలి పాటగా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.
previous post
next post