Samantha Rashmika: ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు రష్మిక మందన హవా కొనసాగుతుంది. 2021వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” రష్మిక మందన కెరియర్ పూర్తిగా మార్చేసింది. పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయిన పుష్ప ప్రపంచ స్థాయిలో విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమాలో పాటలు మరియు డాన్స్ ఇంకా డైలాగులు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “నా సామి బంగారు సామి” అనే సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ దక్కించుకోవడం జరిగింది. దీంతో హిందీలో మరియు దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీ ప్రాజెక్టు సినిమా అవకాశాలు రష్మిక సొంతమవుతున్నాయి.
కెరియర్ పరంగా మంచి జోరు మీద ఉన్న రష్మిక తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే తన తోటి హీరోయిన్ సమంత గురించి రష్మిక ఎమోషనల్ కామెంట్ చేసింది. సమంత ఒక అద్భుతమైన స్త్రీ మూర్తి. సమంతకి అందంతోపాటు మంచి దయా గుణం కలిగిన వ్యక్తి అని పేర్కొంది. సమంత తనకు మయాసైటిస్ వచ్చినట్లు ప్రకటించిన తర్వాతే తనకి తెలిసిందని చెప్పుకొచ్చింది. గతంలో తమరి మధ్య అనేక చర్చలు జరిగిన గాని ఈ ప్రస్తావన ఇప్పుడు రాలేదని తెలిపింది. ఇటువంటి కష్టమైన పరిస్థితులలో సమంతాన్ని ఒక తల్లి మాదిరిగా కాపాడాలనుకుంటున్నానని… ఆమెకు వెన్నంటే ఉండాలనుకుంటున్నట్లు రష్మిక చెప్పుకొచ్చింది.
జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి… మంచి స్ఫూర్తి పొందవచ్చు. ఆ రీతిగానే తాను సమంతా నుంచి ఎన్నో విషయాలు ఆదర్శంగా తీసుకున్నట్లు రష్మిక మందన చెప్పుకొచ్చింది. తనకెంతో ఇష్టమైన సామ్ కి రాబోయే రోజుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన పుష్ప రెండో భాగం సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ ఏడాదిలోనే “పుష్ప 2” విడుదల కానుంది. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధిక భాషల్లో విడుదల చేసే తరహాలో సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!