RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుని నేషనల్ వైడ్గా సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం చరణ్ `ఆచార్య`తో ప్రేక్షకులను పలకరించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. కానీ, ఇందులో చరణ్ కీలక పాత్రను మాత్రమే పోషించడం వల్ల ఆచార్య ప్లాప్ ఆయన లిస్ట్లో పడలేదు.
ఇకపోతే `ఆర్ఆర్ఆర్` అనంతరం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఇండియన్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరైన శంకర్తో చేయబోతున్నట్లు చరణ్ ప్రకటించాడు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
శ్రీ వెంకటేశ్వర క్రియేన్స్ బ్యానర్పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అరవై శాతం వరకు కంప్లీట్ అవ్వగా.. ఇంకా కొన్ని షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే షూటింగ్ శర వేగంగా కానిస్తుండటతో.. ఆర్సీ 15 ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి రావడం ఖాయమని చరణ్ ఫ్యాన్స్ భావించారు.
కానీ,షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు శంకర్ చాలా సమయం తీసుకుంటాడు. ఇది ఆయనకు కొత్తేం కాదు. శంకర్ ప్రతీ సినిమా విషయంలో ఇదే జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే 2023 సంక్రాంతికి ఆర్సీ 15 రావడం కష్టమే అని.. సమ్మర్ హాలీడేస్ లో రిలీజ్ ఉండవచ్చని అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఆర్సీ 15పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చరణ్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ తగిలినట్టే అవుతుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!