OTT: సరిగ్గా రెండేళ్ల క్రితం వరకు ముఖ్యంగా మన దక్షిణాది ప్రేక్షకులకు OTT పెద్దగా తెలియదు. అయితే కరోనా కారణంగా ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. నెలల కొద్దీ అంతా ఇంటి పట్టునే వుండటంతో వినోదం కోసం టీవిని ఆశ్రయించవలసి పరిస్థితి. ఈ క్రమంలో యువత OTT కంటెంట్ ని చూడటం స్టార్ట్ చేసింది. దాంతో కరోనా దెబ్బతో OTTలకు మంచి ఆదాయం పెరిగింది. సబ్స్ స్క్రైబర్స్ కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యారు. ఈ నేపథ్యంలో OTTలు కూడా తమ యూజర్స్ ని దోచుకొనే పనిలో పడ్డాయి.
షాకులిస్తున్న OTTలు!
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన ‘RRR’ కేజీఎఫ్ 2 చిత్రాల స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్, జీ5 సంస్థలు ఈ సినిమాలతో పే పర్ వ్యూ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఇదే ఇప్పడు యూజర్లకు తలనొప్పిగా మారింది. ఏడాదికి రూ.699 సబ్స్ స్క్రిప్షన్ కట్టించుకుంటున్న జీ5 తన OTT ప్లాట్ ఫామ్ లో పాన్ ఇండియా క్రేజీ మూవీ RRR ని చూడాలంటే మరింత మొత్తం చెల్లించాల్సిందే అంటూ షాకిచ్చింది. ఇదే తరహాలో ఏడాదికి రూ .14499 రూపాయలు కట్టించుకుంటున్న అమెజాన్ ప్రైమ్ అదీ చాలదన్నట్టు ‘కేజీఎఫ్ 2’ కోసం రూ. 199 కట్టాల్సిందే అంటూ ప్రకటించింది.
OTTలకు వార్నింగ్ ఇస్తున్న నెటిజన్లు:
ఈ నేపథ్యంలో ఈ రెండు OTTలపైన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇకపై ఈ రెండు OTTల్లో సబ్స్ స్క్రిప్షన్ చేసుకోమంటూ హెచ్చరిస్తూ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ట్యాగ్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అత్యాశకు పోయి ప్రవేశ పెట్టిన పే పర్ వ్యూ ఫార్ములా దారుణంగా బెడిసికొట్టినట్టుగా సమాచారం. ప్రస్తుతం టెక్నాలజీ మారింది. అరచేతిలోకి ప్రపంచం స్మార్ట్ ఫోన్ రూపంలో రావడంతో ప్రతీదీ ఈజీ అయిపోయింది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కూడా క్షణాల్లోనే టొరెంట్ లలో దొరికిపోతున్నాయి. దీంతో భారీ ఖర్చు చేసి OTTల్లో సినిమాలు చూడాలని సగటు ప్రేక్షకుడు ఎందుకు అనుకుంటాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!