Taliban: దాదాపు 20 సంవత్సరాల తర్వాత తాలిబాన్ లు గత ఏడాది ఆగస్టు మాసంలో ఆఫ్ఘనిస్తాన్ నీ తమ స్వాధీనంలోకి తీసుకోవడం తెలిసిందే. అంతకుముందు ప్రజాస్వామ్య ప్రభుత్వం దాదాపు ఇరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించగా… ప్రజలంతా స్వేచ్ఛ జీవులగా బతికారు. కానీ ఎప్పుడైతే తాలిబాన్ లు దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం జరిగిందో… ఆఫ్ఘనిస్తాన్ పౌరులు భయంతో బతుకుతూ ఉన్నారు. తాలిబాన్ మళ్లీ దేశాన్ని స్వాధీన పరచుకునే తొలిదశలో చాలా మంది దేశం విడిచి పారిపోవడం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదంతా పక్కన పెడితే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మాదిరిగా కాకుండా… ఆడ పిల్లలు మహిళలు ఉన్నత చదువులు చదవకూడదని.. మళ్లీ తాలిబాన్ లు.. ఆడవాళ్ళ పై ఆంక్షలు విధిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సరికొత్తగా టీవీ లో పనిచేసే లేడీ యాంకర్ లకి కొత్త రూల్ తాలిబాన్ ప్రభుత్వం తీసుకు వచ్చింది. టీవీ యాంకర్ లో ముఖాన్ని పూర్తిగా ఒప్పుకుని వార్తలు చదవాలని కొత్త తరహా ఆంక్షలు విధించింది.
అంతమాత్రమే కాదు తమ ఆదేశాలను పాటించేందుకు మే 21 చివరి గడువు.. అని డెడ్ లైన్ పెడుతూ.. మంత్రి అఖిఫ్ మహా జార్ సరికొత్త ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ఆడపిల్లలు ఆరో తరగతి తర్వాత బాలికల విద్య పై నిషేధం తో పాటు మహిళలు బయటకు వస్తే పూర్తిగా ముఖం కప్పుకోవాలని… ఒంటరిగా విమానాల్లో ప్రయాణం చేయకూడదని… తాలిబాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇప్పుడు టీవీ యాంకర్ లపై కూడా ఆంక్షలు విధించే తరహాలో కొత్త నిబంధనలు తీసుకురావటం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.