Sai Pallavi Yash: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది చలనచిత్రా రంగంలో అనేక భాషలలో సినిమాలు చేసి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మలయాళం లో “ప్రేమమ్” సినిమాతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లలో నటనపరంగా డాన్స్ పరంగా సాయి పల్లవిని మించిన హీరోయిన్ మరొకరు లేరని చెప్పవచ్చు. తెలుగులో సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమె నటించిన ఫిదా, లవ్ స్టోరీ ఆమెకు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి.
పద్ధతి గల పాత్రలు కలిగిన సినిమాలలో నటిస్తూ ఎక్కడా కూడా.. ఎక్స్పోజింగ్ కి ఆస్కారం లేకుండా.. చాలా జాగ్రత్త పడుతూ ఉంటది. అటువంటి సాయి పల్లవి తాజాగా “కేజిఎఫ్” హీరో యాష్ సినిమాలో ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “కేజిఎఫ్ 2” తర్వాత యాష్ మరో సినిమా ప్రకటించలేదు. కానీ ఇటీవల డిసెంబర్ 8వ తారీకు తన తదుపరి సినిమా ప్రకటించబోతున్నట్లు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని టాక్. యాష్ కెరియర్ లో ఇది 19వ సినిమాగా తెరకెక్కబోతుంది. “KGF” లాంటి హిట్ పడిన తర్వాత..యాష్ చాలా జాగ్రత్తగా ఆచితూచి స్టోరీ సెలక్షన్ కోసం ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో “కేజిఎఫ్” కి మించిన సినిమా ఇవ్వడానికే సమయం తీసుకున్నట్లు అభిమానులకు కూడా తెలియజేశారు. ఇప్పుడు ఆ రకంగానే.. స్టోరీ సెలెక్ట్ అయినట్లు.. డిసెంబర్ 8వ తారీకు ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఓకే చేసిన ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్.. నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. అయితే బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాని మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్. కేజిఎఫ్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావటంతో పాటు..పాన్ ఇండియా గుర్తింపురావడంతో అదే స్థాయిలో సినిమా ఉండే విధంగా యాష్ అనేక కథలు విని చివరాఖరికి ఒకటి కన్ఫామ్ చేశారట. ఇది కూడా ఓ రేంజ్ లో..మాస్ ఇమేజ్ తరహా కలిగిన సబ్జెక్ట్ అని టాక్.