Samantha: స్టార్ హీరోయిన్ సమంత పోడ్ క్యాస్ట్ ద్వారా అనేక విషయాలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. తాను అనారోగ్యానికి గురైన సమయంలో తీసుకున్న జాగ్రత్తలు గురించి ఆ అనుభవాలు గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ గా “పుష్ప” ఐటెం సాంగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “పుష్ప” లో సూపర్ హిట్ అయిన ‘ఊ అంటావా’ సాంగ్ చేసే ముందు వణికానని నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అలాంటి పాటలు చేయాలంటే ఎవరి మాట వినకూడదు. నా అందంపై నాకు తొలి నుంచి అసౌకర్యంగా ఉండేది. పెద్ద ధీమాగా ఉండేదాన్ని కాదు. అందరు అమ్మాయిల్లా కాదు అనుకునేదాన్ని. నాకు ఆ పాట చాలా పెద్ద సవాలు. తొలి షాట్ కీ భయంతో వణికాను.
కానీ ఇప్పుడు నటిగా, వ్యక్తిగా నేను ఎదిగాను’ అని స్పష్టం చేశారు. వరుసపరాజయాలలో ఉన్న సమంత గత ఏడాది “ఖుషి” సినిమాతో విజయం సాధించడం జరిగింది. ఈ సినిమా విజయం అనంతరం సమంత మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. “ఖుషి” విజయం తర్వాత మయోసైటీస్ బ్యాలెన్స్ ట్రీట్మెంట్ కోసం విదేశాలలో వ్యవహరించింది. అక్కడ దాదాపు రెండు నెలలపాటు చికిత్స తీసుకుని పూర్తిగా రికవరీ అనంతరం గత ఏడాది చివరిలో హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. హిందీలో ఒప్పుకున్న వెబ్ సిరీస్ కి డబ్బింగ్ చెప్పడం జరిగింది.
ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు చేయడానికి సమంత అన్ని రకాలుగా రెడీ అవుతూ ఉంది. ఖుషి తర్వాత మరో ప్రాజెక్ట్ సమంత ఒప్పుకోలేదు. ప్రస్తుతం సమంతా దగ్గరికి చాలా స్క్రిప్టులు వస్తున్నాయట. సౌత్ తో పాటు నార్త్ లో కూడా అవకాశాలు వస్తున్నాయట. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ సినిమా చేయాలని సమంత భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో ఐటెం సాంగ్ భారీ హిట్ కావడంతో “పుష్ప” సెకండ్ పార్ట్ లో కూడా ఐటెం సాంగ్ అదరగొట్టే రేంజిలో దేవిశ్రీప్రసాద్ ట్యున్స్ ఇవ్వడం జరిగిందంట. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో జాహ్నవి కపూర్ స్టెప్పులు వెయ్యబోతున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!