Samantha-Naga Chaitanya: టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. `ఏ మాయ చేశావే` మూవీతో ఏర్పడ్డ వీరిద్దరి పరిచయం.. ఆపై ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబసభ్యులు అంగీకరించడంలో చైతు, సామ్లు గోవాలో రెండు సంప్రదాయాల ప్రకారం అట్టహాసంగా వివాహం చేసుకున్నారు.
అప్పట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అయితే ఏం లాభం.. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు. వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు సరైన స్పష్టత బయటకు రాకపోయినా.. సామ్, చైతుల గురించి ఏదో ఒక వార్త రోజూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
విడాకులు తర్వాత చైతు ఙ్ఞాపకాలను చెరిపేసుకుంటూ పోతున్న సమంత.. తొలిసారి మాజీ భర్త ఫొటోను ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు చైతు ఫొటోలను సామ్ ఎందుకు షేర్ చేసిందంటే.. వీరిద్దరూ చివరిగా కలిసి నటించిన చిత్రం `మజిలీ`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంపుల్స్గా చైతు, సామ్లు తమదైన నటనతో మిస్మరైజ్ చేశారు.
2019లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అయితే ఈ మూవీ విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే `3ఇయర్స్ ఆఫ్ మజిలీ` అంటూ ఆ మూవీ పోస్టర్ని షేర్ చేసింది. ఇక డివోర్స్ తర్వాత తొలిసారి సామ్.. చై ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఆమె పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!