మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. డిసెంబర్ నెలలోని ఐదు సోమవారాల్లో ఐదు పాటలను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ‘ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మా వంతుగా మేం కష్టపడ్డాం. సినిమాలోని ప్రతి పాట అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను” అంటూ దేవిశ్రీ ప్రసాద్ మెసేజ్ పెట్టారు. అందులో భాగంగా తొలి పాటను డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో లేడీ అమితాబ్గా పేరు సంపాదించుకున్న సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తోంది.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!