Guntur Kaaram: తెలుగు చలనచిత్ర రంగంలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు. అన్నదమ్ములలో పరుచూరి గోపాలకృష్ణ చిన్నవారు. మాటల రచయితీగా నటుడిగా సుప్రసిద్ధుడు. తన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. 1990ల అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక కమర్షియల్ సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించారు. అన్నదమ్ములలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.
ఇటీవల ఆయన తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ “గుంటూరు కారం” మహేష్ బాబు చేయాల్సిన సినిమా కాదని అన్నారు. మహేష్ స్థాయికి తగిన సినిమా కాదని పేర్కొన్నారు. నేను ఎవరిని విమర్శించడం లేదు. కానీ నా వరకైతే సినిమా స్క్రీన్ ప్లే గందరగోళానికి గురిచేసింది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ ఇతర సినిమాలతో పోలిస్తే “గుంటూరు కారం” కాస్త తేడాగా అనిపించింది. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో సరిగ్గా ఏది పండలేదు. పైగా ఫ్యామిలీ సినిమాకు మాస్ టైటిల్ పెట్టడం తప్పు అని పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. త్రివిక్రమ్… మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడు సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అల్లరించలేదు.
సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు రిలీజ్ కాగా మొదటి రోజే నెగటివ్ టాక్ సంపాదించుకుంది. సినిమాలో మహేష్ బాబు డాన్స్ పాటలు మినహా ప్రేక్షకులను స్టోరీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ పెన్ పవర్ డైలాగులు ఎక్కడ కూడా లేవని.. అశ్రద్ధగా తీశాడని మహేష్ అభిమానులు అసహనం చెందారు. ఈ సినిమాకి మొదటి నుండి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రారంభంలోనే సినిమా ప్రాజెక్టు నుండి పూజా హెగ్డే బయటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతమంది టెక్నీషియన్స్ కూడా ప్రాజెక్టు నుండి వెళ్ళిపోయారు. ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ షూటింగ్ జరుపుకున్న “గుంటూరు కారం” ఫైనల్ గా సంక్రాంతికి విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!