Trinayani February 17 2024 Episode 1166: ఒకటే ఇంట్లో ఉంటున్నాను కదా ఎలాంటి గొడవలు మనసులో పెట్టుకోకూడదు అని దురంధర అంటుంది.విశాలాక్షిని సుమన లేపుతుంది.ఏంటి సుమన అని విశాలాక్షి అంటుంది.క్షమించమ్మ జ్ఞానానికి భంగం కలిగినందుకు అని ఎద్దులయ్య అంటాడు.సుమన లేపితే నువ్వు క్షమాపణ అడుగుతావు ఎందుకు ఎద్దులయ్య అని విశాలాక్షి అంటుంది.విశాలాక్షి పాలు తీసుకురాపో ఉలోచికి పట్టాలి అని సుమన అంటుంది.దానికి విశాలాక్షి ఎందుకమ్మ నేను తెస్తాను అని ఎద్దులయ్య అంటాడు.నేనే వెళ్లాలి ఎద్దులయ్య పనుంది అంటూ విశాలాక్షి వెళుతుంది.సుమన నా మీద నింద మోపడానికి ఇంత పెద్ద తప్పు చేయాలా అబద్ధమాడితే సరిపోతుంది కదా అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి ఆ పాలు తీసుకొని వెళుతుంది. అందరూ ఏం చేస్తున్నారు అని హాసిని అంటుంది.ఈ ఇంట్లో ప్రశాంతతే లేదు అని వల్లభ అంటాడు.మీరు ఉండగా ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అని హాసిని అంటుంది.కట్ చేస్తే,ఇంతలో విశాలాక్షి పాలు తీసుకువచ్చి సుమనకి ఇస్తుంది.
కిచెన్ లోకి వెళ్లి ఏం చేశావు అని సుమన విశాలాక్షిని అడుగుతుంది.విశాలాక్షి ఏం చేస్తుంది అని నైని అంటుంది. విశాలాక్షికి పని ఎవరు చెప్పారు అని విశాల్ అంటాడు. నేనే చెప్పాను బావగారు కానీ ఎద్దులయ్య తెస్తాను అంటే నాకు పనుంది నేనే వెళ్లాలి అంటూ విశాలాక్షి వెళ్ళింది అందులో ఏం కలిపిందో ఏమో అని సుమన అంటుంది. ఆ మాట మాత్రం నిజమే విశాల్ అని దురంధర అంటుంది. విశాలాక్షి ఏం కలుపుతుంది అందులో అని నైని అంటుంది. విషం అని ఎద్దులయ్య అంటాడు. ఎద్దులయ్య ఏం మాట్లాడుతున్నావ్ అని డమ్మక్క అంటుంది. విశాలాక్షికి విషం కలపాల్సిన అవసరం ఏముంటుంది అని విక్రాంత్ అంటాడు. నిన్న ఆఫీసులో ఉలోచి ఉన్నట్టు ఇక్కడ దురంధర పిన్ని దగ్గర ఉలోచి ఉన్నట్టు గారడి చేసింది కదా అలాగే ఏమైనా గారడి చేసి పాలలో విషం కలిపిందేమో నాకు కూతురు లేకుండా చేయడానికి అని సుమన అంటుంది. ఎందుకు గొడవ ఆ గ్లాసు మా అత్తయ్యకి ఇచ్చేయ్ అత్తయ్య నువ్వు ఆ పాలు తాగు విషం ఉందో లేదో తెలుస్తుంది అని హాసిని అంటుంది. అందులో విషం కలిపి ఉంటుంది అక్క కాటికి పోతారు నువ్వు కామెడీ చేయకు అని సుమన అంటుంది. అంత ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వు ఏమైనా కలిపావా సుమన అని విశాలాక్షి అంటుంది.
ఇది మరీ బాగుంది పాలు తీసుకురమ్మన్న సుమననే కలిపావా అని నిందిస్తుంది అని తిలోత్తమ అంటుంది. బ్రతకనిచ్చారు కదా అని వల్లభ అంటాడు. విశాలాక్షి పాడు పని చేయదు బావగారు నోటికొచ్చినట్టు మాట్లాడకండి అని నైని అంటుంది. ఎవరికి తెలుసు అని తిలోత్తమ అంటుంది. విశాలాక్షి తెచ్చిన పాలలో విషమే ఉందనుకో విశాలక్షికి ఏం కాదు తను పాము పిల్ల కదా అని విక్రాంత్ అంటాడు. అవును కదా అని పావను మూర్తి అంటాడు. బుద్ధుందా మీకు పని సుమన అంటుంది. పెద్ద చిన్న తేడా లేకుండా ఏం మాట్లాడుతున్నావ్ అని హాసిని అంటుంది. రాత్రి పాము పిల్ల అయినా పగలంతా ఆడపిల్లగానే ఉంటుంది కదా అప్పుడు వేపాకు తాగిన చేదుగానే ఉంటుంది పైగా విషం కలిపిన పాలు తాగమంటున్నారు అని సుమన అంటుంది. అసలు అందులో విషం ఉంది అంటూనే ఉన్నాం నీకెలా తెలుసు అని నైని అంటుంది. విషం కలపడం చూస్తే చెప్పు సుమన అని విశాల్ అంటాడు. తన మీద నాకు అనుమానంగా ఉంది అని సుమన అంటుంది. విషం ఉందని సుమన అంటుంది నువ్వేమంటావమ్మ అని ఎద్దులయ్య అంటాడు. కొద్దిసేపు ఆగితే అంతా తెలుస్తుంది అని విశాలాక్షి అంటుంది.
పాలలో విషం కలిస్తే నైనికి తెలుస్తుంది కదా అప్పుడు చెప్తుంది కదా అని హాసిని అంటుంది. ఆ మాట విశాలాక్షిని చెప్పమనండి అని సుమన అంటుంది. నిజంగానే ఉంటే చెప్పేది కదా సుమన అని విశాల్ అంటాడు. పోతే పోయిందిలే పాము పిల్లే కదా అనుకుంటే ఎవరేం చేస్తారు బావగారు అని అంటుంది సుమన .దవడ మీద కొడితే పది పళ్ళు రాలుతాయి నాకు ఎవరైనా ఒకటే అని నైని అంటుంది. నైని సుమన మాటలు పట్టించుకోకు అని విశాల్ అంటాడు. తప్పు చేసిన విశాలాక్షిని వదిలేయమంటారా అని తిలోత్తమ అంటుంది. అమ్మ నిజం తెలియకుండా తప్పు మాట్లాడి చిన్న పిల్ల ముందు పరువు పోగొట్టుకోకూడదు అని విశాల్ అంటాడు. పెద్దమ్మ చెప్పినట్టు వేరే పాలు తీసుకురానా అని విశాలాక్షి అంటుంది. ముందు అందులో విషం ఉందా లేదా చెప్పు అని సుమన అంటుంది. ఉంది ఆ పాలలో నువ్వే విషం కలిపావు కదా అని విశాలాక్షి అంటుంది. చిట్టి నువ్వే పాలలో విషం కలిపి నీ కూతురికి పట్టాలనుకుంటావా అని హాసిని అంటుంది. విశాలాక్షి అలా అంటుంటే మీరేం మాట్లాడరేంటండి అని సుమన అంటుంది.
ఈ గారడి పిల్ల తమాషాగా ఉందా అని వల్లభ అంటాడు. ఆ పాలు తెచ్చింది నువ్వే కదా మా సుమన అంటావే అని దురంధర అంటుంది. ఇందాకడి నుంచి మీరు విశాలాక్షిని అంటున్నారు అని నైని అంటుంది. అమ్మ అలాంటిదే ఏదైనా ఉంటే నువ్వు చెప్పే దానివి కదా నువ్వు చెప్పలేదంటే ఇందులో విషం లేదనే కదా అర్థం అని విశాలాక్షి అంటుంది. అక్క నువ్వు చెప్పు అందులో విషం లేదు అని సుమన అంటుంది.విశాలాక్షి చెప్పింది కదా అని అంటుంది నైని .అయితే ఏదైనా విషం కలిపితే మా అక్కకి తెలుస్తుంది చెప్తుంది కదా అయితే పాపని పట్టుకోండి అని అపాలు తీసుకొని సుమన తాగేస్తుంది. విషం కలిపిన పాలు తాగాను నేను చస్తానో లేదో తెలియదు కానీ విశాలాక్షిని మా అక్కని అసహ్యించుకుంటారు అందరూ అని సుమన అనుకుంటుంది. చూశావా పాలు తాగేసావు నీకేమైనా అయ్యిందా వదినని విశాలక్షిని నిందించావు అని విక్రాంత్ అంటాడు. సుమనకి మత్తు వచ్చి కళ్ళు తిరిగి నురుగు పెట్టి కింద పడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. నిజంగానే అందులో విషం ఉందేమో అని విశాల్ అంటాడు. త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్దాం పదండి అని విశాల్ విక్రాంత్ సుమనని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు.
విశాలాక్షి నువ్వు శ్రీశైలం వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో తెలియదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నైని దండం పెడుతుంది. ఇందులో అమ్మ తప్పేముందమ్మ అని ఎద్దులయ్య అంటాడు. కట్ చేస్తే, గాయత్రీ అమ్మగారి ఆత్మతో మాట్లాడే నేను సుమన విషం కలిసిన పాలు తాగిందని ఎందుకు గ్రహించలేకపోయాను అని నైని అంటుంది. అమ్మతో మాట్లాడితే ఏమొస్తుంది సుమనకి ఏదైనా అయితే నిన్నే నిందిస్తారు అని విశాల్ అంటాడు. సుమనకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఏం చెప్పారు అని నైని అంటుంది. ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేదు అని విశాల్ అంటాడు. మీరన్నట్టు నిజంగానే సుమనకి ఏదైనా జరిగితే అందరూ నన్నే నిందిస్తారు అని నైని బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.